ప్రేయసిని చంపి.. తప్పించుకుని పారిపోతుండగా మృత్యువుకు చిక్కి.. షాకింగ్ ఇన్సిడెంట్

|

Sep 30, 2022 | 11:18 AM

మృత్యువు ఒకసారి పగ బట్టిందంటే.. తన పంతం తీర్చుకునే వరకు వదలంటే ఇదేనేమో.. ఒకసారి చావు నుంచి బయటపడి పారిపోతుండగా మరో సారి మృత్యువు విరుచుకుపడింది. ఈ సారి అతను..

ప్రేయసిని చంపి.. తప్పించుకుని పారిపోతుండగా మృత్యువుకు చిక్కి.. షాకింగ్ ఇన్సిడెంట్
Road Accident
Follow us on

మృత్యువు ఒకసారి పగ బట్టిందంటే.. తన పంతం తీర్చుకునే వరకు వదలంటే ఇదేనేమో.. ఒకసారి చావు నుంచి బయటపడి పారిపోతుండగా మరో సారి మృత్యువు విరుచుకుపడింది. ఈ సారి అతను ఓడిపోక తప్పలేదు. తప్పు చేస్తే దానికి ప్రతిఫలం కూడా వెంటనే కనిపించేస్తోంది. ఈ వాస్తవాలను ఈ ఇన్సిడెంట్ ప్రూవ్ చేస్తోంది. మాటా మాటా పెరిగి ప్రియురాలిని హత్య చేసిన ఓ యువకుడు.. పారిపోతూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో జిల్లాకు చెందిన కృష్ణయాదవ్‌.. నేహా అనే యువతిని ప్రేమించాడు. కొన్నాళ్లు వారి ప్రేమాయణం సజావుగానే సాగింది. ఆ సమయంలో వారిద్దరూ మాట్లాడుకునేందుకు బోయిసర్‌లోని రైల్వే ఫ్లైఓవర్‌ కిందకు వచ్చారు. సరదాగా మొదలైన వారి సంభాషణ మాటా మాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. దీంతో విచక్షణ కోల్పోయిన కృష్ణ యాదవ్.. యువతిపై తుపాకీ గురి పెట్టాడు. అంతటితో ఆగకుండా తలపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

యువతి చనిపోవడంతో కృష్ణ భయాందోళనకు గురయ్యాడు. అక్కడి నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తాడు. ముందూ వెనకా చూసుకోకుండా వెళ్లడంతో రోడ్డుపై వేగంగా వస్తున్న కారు.. బలంగా ఢీ కొట్టింది. అయినా అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుని మళ్లీ పరుగందుకున్నాడు. కానీ ఈ సారి మాత్రం అతను మృత్యువు నుంచి తప్పించుకోలేకపోయాడు. ఆర్మీకి చెందిన ఓ ట్రక్కు ఎదురుగా వచ్చి అతడిని ఢీ కొట్టింది. ఈ రెండు ఘటనల్లో కృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షిస్తుండగా ఆస్పత్రిలోనే కృష్ణ ప్రాణాలు కోల్పోయాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..