AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat: సైకిల్‌కు సిలిండర్‌ కట్టుకుని.. ఓటేయడానికి వెళ్లిన ఎమ్మెల్యే.. కారణం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

గుజరాత్‌లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుని బారులు తీరారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వినూత్నంగా పోలింగ్‌...

Gujarat: సైకిల్‌కు సిలిండర్‌ కట్టుకుని.. ఓటేయడానికి వెళ్లిన ఎమ్మెల్యే.. కారణం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..
Vote With Cylinder
Ganesh Mudavath
|

Updated on: Dec 01, 2022 | 1:26 PM

Share

గుజరాత్‌లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుని బారులు తీరారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వినూత్నంగా పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు. ఇప్పుడు ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గ్యాస్‌ సిలిండర్‌ను సైకిల్‌కు కట్టుకొని ఓటు వేయడానికి వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవల కాలంలో వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. క్రమం క్రమంగా పెరుగుతూ దాదాపు రూ.1200కు చేరుకుంది. దీంతో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ ధరల పెంపుపై ప్రతిపక్షాలు కూడా గట్టిగానే ప్రతిస్పందిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా పెరిగిన ధరలతో సామాన్యుడి నడ్డి విరుగుతోందని మండిపడుతున్నాయి. ఈ పరిస్థితుల మధ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్నాయి. ఇదే సరైన సమయం అని భావించిన ఓ ఎమ్మెల్యే ఇలా వెరైటీగా నిరసన చేపట్టారు.

అమ్రేలిలో హస్తం పార్టీ ఎమ్మెల్యే పరేశ్‌ ధనాని.. సైకిల్‌కు సిలిండర్‌ కట్టుకుని తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటేయడానికి పోలింగ్‌ కేంద్రానికి వెళ్లారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్పీజీ సిలిండర్‌ ధరలు భారీగా పెరిగాయని దానిపై రాశారు. ఇలా బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఓటర్ల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరోవైపు.. గుజరాత్‌లో తొలి విడతలో భాగంగా 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2.39 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రెండో విడుత ఎన్నికలు ఈ నెల 5 న జరుగనుండగా, డిసెంబర్‌ 8న ఫలితాలు వెలువడనున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం

వందే భారత్ రైళ్లపై మరో కీలక అప్డేట్
వందే భారత్ రైళ్లపై మరో కీలక అప్డేట్
మంటల్లోంచి బుసలు కొడుతూ బయటకొచ్చిన నాగుపాము.. ఆ తర్వాత సీన్
మంటల్లోంచి బుసలు కొడుతూ బయటకొచ్చిన నాగుపాము.. ఆ తర్వాత సీన్
రైళ్లలో తెల్లటి బెడ్‌షీట్లే ఎందుకు ఇస్తారో తెలుసా..? ఆ రహస్యం..
రైళ్లలో తెల్లటి బెడ్‌షీట్లే ఎందుకు ఇస్తారో తెలుసా..? ఆ రహస్యం..
లైవ్ మ్యాచ్‌లో వికెట్ కీపర్ సెలబ్రేషన్ చూస్తే నవ్వాపుకోలేరంతే..!
లైవ్ మ్యాచ్‌లో వికెట్ కీపర్ సెలబ్రేషన్ చూస్తే నవ్వాపుకోలేరంతే..!
నారీ నారీ నడుమ మురారి సినిమాను మిస్ అయిన హీరో ఎవరంటే..
నారీ నారీ నడుమ మురారి సినిమాను మిస్ అయిన హీరో ఎవరంటే..
వందే భారత్ స్లీపర్ రైళ్లలో కొత్త లగేజీ రూల్స్.. ఆ పరిమితి దాటితే.
వందే భారత్ స్లీపర్ రైళ్లలో కొత్త లగేజీ రూల్స్.. ఆ పరిమితి దాటితే.
పగడపు రత్నం: ఇది మీ జీవితం మార్చేస్తుంది.. కానీ ఈ తప్పు చేస్తే..?
పగడపు రత్నం: ఇది మీ జీవితం మార్చేస్తుంది.. కానీ ఈ తప్పు చేస్తే..?
చలికాలంలో రోజుకు ఎన్ని కప్పుల చాయ్ తాగాలి.. ఎక్కువ తాగితే..
చలికాలంలో రోజుకు ఎన్ని కప్పుల చాయ్ తాగాలి.. ఎక్కువ తాగితే..
బరువు తగ్గడానికి భోజనం మానేస్తున్నారా..?మీరు డేంజర్‌లో పడినట్టే!
బరువు తగ్గడానికి భోజనం మానేస్తున్నారా..?మీరు డేంజర్‌లో పడినట్టే!
నమ్మకంతో చోటిస్తే, నట్టేట ముంచేసిన టీమిండియా ప్లేయర్..?
నమ్మకంతో చోటిస్తే, నట్టేట ముంచేసిన టీమిండియా ప్లేయర్..?