AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil Nadu: దారితప్పి స్టేషన్‌లోకి వచ్చిన చిరుత పులి.. తెలివిగా పోలీస్ అధికారి ఏం చేశాడో చూడండి!

ప్రస్తుత రోజుల్లో జనాలు అడవులు నరికి పెద్ద పెద్ద భవనాలు, కంపెనీలు వంటిని నిర్మిస్తున్నారు. దీంతో అడవుల్లో జీవించే జంతవులకు నిలువనీడ లేకుండా పోతుంది. ఇలాంటి సందర్బాల్లో అడవుల్లో ఉండాల్సిన వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులోని నీలగిరి జిల్లాలో చోటుచేసుకుంది. అడవుల్లో ఉండాల్సిన ఓ పులి పోలీస్‌స్టేషన్‌లోకి దూరింది. పులిని చూసి భయాందోళనకు గురైన పోలీసులు దెబ్బకు స్టేషన్‌ను వదిలి బయటకు వెళ్లారు.

Tamil Nadu: దారితప్పి స్టేషన్‌లోకి వచ్చిన చిరుత పులి.. తెలివిగా పోలీస్ అధికారి ఏం చేశాడో చూడండి!
Tamilnadu
Anand T
|

Updated on: Apr 29, 2025 | 1:36 PM

Share

తమిళనాడులోని నీలగిరి జిల్లా గూడలూర్ సమీపంలోని నడువట్టం ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ లోకి చిరుతపులి ప్రవేశించడం స్థానికంగా కలకలం రేపుపింది. ఏప్రిల్ 28, రాత్రి 8.30 గంటల ప్రాంతంలో గూడలూరు-ఊటీ జాతీయ రహదారి పక్కన ఉన్న నడువట్టం పోలీస్ స్టేషన్‌లోకి ఓ చిరుతపులి ప్రవేశించింది. మెళ్లగా పీఎస్‌ లోపలికి వచ్చి ఇన్స్పెక్టర్ కూర్చున్న గది చుట్టూ తిరిగింది. ఆ గదిలో తినడానికి ఏమైనా ఉన్నాయా అని చూసింది. అదే సమయంలో, మరొక గదిలో విధుల్లో ఉన్న ఒక పోలీసు అధికారి గదిలో చిరుతపులి తిరగడం చూసి షాక్ అయ్యాడు. భయంతో శబ్దం చేయకుండా మౌనంగా అక్కడే నిలబడిపోయాడు. ఇక గది మోత్తం తిరిగి చూసి తినడానికి ఏమీ లేకపోవడంతో, చిరుతపులి తిరిగి మెట్లు దిగి, వచ్చిన దారిలోనే బయటకు వెళ్లిపోయింది. దీంతో పులి ఉందా వెళ్లి పోయిందానని తలుపు గుండా తొంగి చూశాడు. పులి వెళ్లిపోవడంతో అమ్మయ్యా.. అని ఊపిరిపీల్చుకున్నాడు. వెంటనే పీఎస్‌ తలుపులు మూసేసి తాళం వేశాడు.

ఆ తర్వాత ఉన్నతాధికారులతో పాటు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు చిరుతను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. అయితే చిరుత పోలీస్‌ స్టేషన్‌లోకి ప్రవేశించిన దృశ్యాలు బయట ఉన్న సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

పీఎస్‌లోకి చిరుతపులి ప్రవేశించడంతో స్థానికంగా ఉన్న ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చిరుతను వీలైనంత త్వరగా పట్టుకొని.. దాని భారీ నుంచి తమను రక్షించాలని అటవీశాఖ అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేశారు. జంతువులు తరచుగా నగరంలోకి రాకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని, ఈ విషయంపై అటవీ శాఖ మరింత నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..