పుణె- బెంగళూరు హైవే ఘోర ప్రమాదం.. ఒకే ప్రమాదంలో 48 వాహనాలు ధ్వంసం..

మహారాష్ట్రలోని పుణెలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుణె- బెంగళూరు హైవేపై ఉన్న ఓ వంతెన వద్ద ట్యాంకర్‌ బీభత్సం సృష్టించింది. ముందు ఉన్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 48 వాహనాలు..

పుణె- బెంగళూరు హైవే ఘోర ప్రమాదం.. ఒకే ప్రమాదంలో 48 వాహనాలు ధ్వంసం..
Road Accident

Updated on: Nov 21, 2022 | 8:09 AM

మహారాష్ట్రలోని పుణెలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుణె- బెంగళూరు హైవేపై ఉన్న ఓ వంతెన వద్ద ట్యాంకర్‌ బీభత్సం సృష్టించింది. ముందు ఉన్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 48 వాహనాలు ధ్వంసమయ్యాయి. సుమారు 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పుణెలోని నావెల్‌ వంతెనపై ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఓ ట్యాంకర్‌ లారీ వేగంగా వెళ్తుండగా బ్రేకులు పని చేయకపోవటంతో ముందు వెళ్తున్న వాహనాలను ఢీకొట్టింది. అందులోని చమురు రోడ్డుపై పడటంతో పలు వాహనాలు పట్టుకోల్పోయి ముందున్న వాహనాలను ఢీకొట్టాయి. మొత్తంగా 48 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పుణె మెట్రోపాలిటన్‌ ప్రాంత అభివృద్ధి సంస్థ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘోర ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ భారీ రోడ్డు ప్రమాదంతో పూణె, బెంగళూరు హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.  బ్రేకులు ఫెయిల్ కావడం, వాహనం లోడ్ తో ఉండటంతో కంట్రోల్ చేయలేకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. భారీగా వాహనాలు ధ్వసమయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..