Mumbai Local Train: కదులుతున్న లోకల్ రైలులో యువతిపై లైంగిక దాడి..

మహారాష్ట్రలోని ముంబయిలో అవమానవీయ ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న లోకల్ ట్రైన్‌లో ఓ 20 ఏళ్ల యువతిని ఓ వ్యక్తి లైంగిక దాడి చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే గిర్‌గౌన్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ నావీ ముంబయిలోని ఓ పరీక్ష రాసేందుకు బయలుదేరింది.

Mumbai Local Train: కదులుతున్న లోకల్ రైలులో యువతిపై లైంగిక దాడి..
Train

Updated on: Jun 15, 2023 | 10:42 AM

మహారాష్ట్రలోని ముంబయిలో అవమానవీయ ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న లోకల్ ట్రైన్‌లో ఓ 20 ఏళ్ల యువతిని ఓ వ్యక్తి లైంగిక దాడి చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే గిర్‌గౌన్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ నావీ ముంబయిలోని ఓ పరీక్ష రాసేందుకు బయలుదేరింది. ఇందుకోసం సీఎస్‌ఎమ్‌టీ వద్ద హర్బర్ లైన్ లోకల్ ట్రైన్‌ను ఎక్కింది. ఆ రైలు కదలడం ప్రారంభమైన వెంటనే ఆమె ఉన్న లేడీస్ కంపార్ట్‌మెంట్‌లోకి ఓ 40 ఏళ్ల వ్యక్తి ఎక్కాడు. అందులో ఎవ్వరూ లేరు ఆ కంపార్ట్‌ మొత్తం ఖాళీగానే ఉంది. ఇంతలో ఆ ట్రైన్ వెళ్తుండగానే ఆ వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె అరవడం మొదలుపెట్టి దూరంగా పారిపోవడంతో.. ఆ వ్యక్తి మస్‌జీద్ స్టేషన్ వద్ద దిగిపోయాడు.

అనంతరం ఆమె రైల్వే పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన జీఆర్పీ, ఆర్పీఎఫ్, ముంబయి పోలీసులు నిందితుడి కోసం గాలించారు. మస్‌జీద్ స్టేషన్‌లో ఉన్న సీసీటీవీలను పరిశీలించారు. చివరికి ఆ నిందితుడ్ని గుర్తించి సాయంత్రం 4.00 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. ఆ నిందుతుడు రోజువారి కూలిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. అతనిపై అత్యాచారంతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని.. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి
Loading...
Unable to load recommendations.
Follow Us