Watch Video: వందేభారత్‌లో ‘వందేమాతరం’.. కుర్రాడి ఫ్లూట్‌ ట్యాలెంట్‌కు ప్రయాణికులు ఫిదా..

దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై-మైసూర్ రూట్‌లో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించిన విషయం తెలిసిందే. నవంబర్‌ 11వ తేదీన బెంగళూరులో ప్రధాని ఈ రైలుకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు సేవలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే..

Watch Video: వందేభారత్‌లో వందేమాతరం.. కుర్రాడి ఫ్లూట్‌ ట్యాలెంట్‌కు ప్రయాణికులు ఫిదా..
Vande Bharat Express

Updated on: Nov 12, 2022 | 5:39 PM

దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై-మైసూర్ రూట్‌లో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించిన విషయం తెలిసిందే. నవంబర్‌ 11వ తేదీన బెంగళూరులో ప్రధాని ఈ రైలుకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు సేవలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ రైలులో చోటు చేసుకున్న ఓ సంఘటన నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఓ విద్యార్థి ఫ్లూట్‌పై వందేమాతం గేయాన్ని అద్భుతంగా ఆలపించిన తీరు నెటిజన్లను ఫిదా చేస్తోంది.

ఓ రైల్వే ఉద్యోగి ఈ వీడియోను షేర్‌ చేయడంతో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. బెంగళూరుకు చెందిన అప్రమేయ శేషాద్రి అనే 12వ తరగతి విద్యార్థి వందేమాతరం గేయాన్ని వేణువుపై అద్భుతంగా పలికించాడంటూ ఆ వీడియోను షేర్‌ చేశాడు. కుర్రాడి ట్యాలెంట్‌కు తోటి ప్రయాణికులు ఫిదా అయ్యారు. ప్రయాణికుల్లో ఒకరు వీడియో తీసి పోస్ట్‌ చేయగా ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వందే భారత్‌ ట్రైన్‌ లో వందేమాతరం గీతాన్ని ఫ్లూట్ పై ఇలా ఆలపించడం ప్రత్యేక సందర్భంగా మిగిలిపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us