Watch: బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. నాలుగు పిల్లర్లు కూలి ఒకరు మృతి..

సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీం ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆనంద్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

Watch: బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. నాలుగు పిల్లర్లు కూలి ఒకరు మృతి..
Bullet train project bridge collapses near Ahmedabad.

Updated on: Nov 05, 2024 | 9:18 PM

గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్‌కు 8 కిలోమీటర్ల దూరంలోని ఆనంద్‌లో బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో ఒకరు మరణించారు. బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో ఒక్కసారిగా నాలుగు పిల్లర్లు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, శిథిలాల కింద మరింత మంది కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీం ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆనంద్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ సంఘటనపై నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ మాట్లాడుతూ, ఈరోజు సాయంత్రం మహి నది వద్ద, బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ నిర్మాణ స్థలంలో ముగ్గురు కార్మికులు కాంక్రీట్ బ్లాకుల మధ్య చిక్కుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us