
మంచి ఆరోగ్యం కావాలంటే కొన్ని రకాల జ్యూస్లను మీ ఆహారంలో చేర్చుకోవటం మంచిది అంటున్నారు. ఇలాంటి పండ్లు, కూరగాయల జ్యూస్లలో పోషకాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చాలా రకాల ప్రాణాంతక వ్యాధుల నుంచి మిమ్మల్ని కాపాడతాయి. ఇందులో అతి ముఖ్యమైనది ఏబీసీ జ్యూస్. ఏబీసీ జ్యూస్ అంటే.. ఆపిల్, బీట్రూట్, క్యారెట్తో తయారు చేస్తారు. వీటిలో పుష్కలమైన పోషకాలు ఉంటాయి.
ఏబీసీ జ్యూస్లో 8 నుంచి 9 గ్రాముల వరకు షుగర్, విటమిన్లు, ఖనిజాలు, 0. 5 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి. కాగా ఈ జ్యూస్ తాగితే.. హిమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి. దీర్ఘకాలిక వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి. కాగా ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగటం వల్ల శరీరంలోని విష వ్యర్థాలన్నీ క్లీన్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. . కాగా వంద మిల్లీలీటర్ల ఏబీసీ జ్యూస్ తీసుకోవటం వల్ల 45-50 కేలరీలు, 10-12 గ్రాముల కార్బోహైడ్రేట్లు అందుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఏబీసీ జ్యూస్ తాగడం వల్ల చర్మం మెరుస్తుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ జ్యూస్లో ఉండే విటమిన్లు, ఖనిజాలు చర్మం సాగే గుణాన్ని పెంచుతాయి. వృద్ధాప్యం వల్ల ముఖంపై వచ్చే దుష్ప్రభావాలను తగ్గిస్తాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మీ గట్ ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనే వారికి ఈ జ్యూస్ ఎంతో మేలు చేస్తుంది. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి.
ఈ జ్యూస్ తాగితే చర్మం కూడా ప్రకాశవంతంగా మెరుస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది జీవక్రియను పెంచడానికి, ప్రేగు కదలికలను క్రమబద్ధీకరించడానికి, మలబద్ధకం తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే క్యారెట్లు మీ కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..