చక్కెర, పెరుగు కలుపుకొని తింటే ఆరోగ్యానికి మంచిదని మనందరికి తెలిసిందే. శరీరం చలువ చేస్తుందని, జీర్ణక్రియ మెరుగవుతుందని చాలా మంది పెరుగులో చక్కెర కలుపుకొని తీసుకుంటుంటారు. అయితే ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందనడంలో ఎంత నిజం ఉందో, కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు సైతం దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందకీ పెరుగు, చక్కెర కలుపుకొని తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* ప్రతీరోజూ పెరుగు, పంచదార కలుపుకొని తీసుకుంటే శరీరంలో కొవ్వు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చక్కెరలో ఉండే అధిక క్యాలరీలే దీనికి కారణంగా చెప్పొచ్చు. ఇది ఊబయాకంతో పాటు మరెన్నో సమస్యలకు దారి తీస్తుంది.
* చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దీని వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. లాక్టోస్ సహజంగా పెరుగులో ఉంటుంది, ఇది ఒక రకమైన చక్కెర. దీంతో చక్కెర కలుపుకొని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరిగే ప్రమాదం ఉంటుంది.
* చక్కెర ఎక్కువగా తినడం వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్స్తో పాటు ఇతర హానికరమైన కొవ్వుల స్థాయి పెరుగుతుంది. ఇది గుండె జబ్బులకు దారి తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి గుండె ఆరోగ్యం కాపాడుకోవాలంటే చక్కెర, పెరుగు కలిపి తీసుకోవడాన్ని తగ్గించాలి.
* పెరుగులో చక్కెర కలిపి తింటే దంతాలు పుచ్చిపోతాయి. చక్కెర బ్యాక్టీరియాకు ప్రధాన మూలంగా చెప్పొచ్చు. ఇది యాసిడ్ను ఉత్పత్తి చేస్తుంది, దీంతో దంతాలను దెబ్బతీస్తుంది.
* చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ చెడిపోతుంది. దీని కారణంగా, ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ప్రతిరోజూ చక్కెరను ఎక్కువ పరిమాణంలో తినకూడదు.
మరిన్ని లైఫ్స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..