AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wedding: పెళ్లికొడుకు.. పెళ్లికుమార్తె మండపంలో లేరు.. అయినా సాంప్రదాయబద్ధంగా వివాహం జరిగిపోయింది

పెళ్లి కుమారుడు.. పెండ్లి కుమార్తె వివాహ మండపంలో లేరు. అయిన వారి వివాహం సంప్రదాయబద్దంగా వేద మంత్రాలు బంధువుల సమక్షంలో

Wedding: పెళ్లికొడుకు.. పెళ్లికుమార్తె మండపంలో లేరు.. అయినా సాంప్రదాయబద్ధంగా వివాహం జరిగిపోయింది
Online Wedding Kurnool
Venkata Narayana
|

Updated on: Aug 14, 2021 | 9:08 PM

Share

Online Wedding: పెళ్లి కుమారుడు.. పెండ్లి కుమార్తె వివాహ మండపంలో లేరు. అయినా వారి వివాహం సంప్రదాయబద్దంగా వేద మంత్రాలు బంధువుల సమక్షంలో అంగరంగవైభవంగా నిర్వహించారు. అందేంటి వివాహ కార్యక్రమంలో పెండ్లి కుమారుడు కుమార్తె లేకుండా వివాహం ఎలా జరిగిందని సందేహ పడుతున్నారా.. అయితే ఆ వివరాల్లోకి వెళ్దాం..

కరోనా నేపథ్యంలో ఆన్ లైన్‌లో విద్యార్థులకు తరగతులు నిర్వహించడం మనం చుశాం. అదే తరహలో వివాహాలు సైతం ఆన్ లైన్‌లో జరుగుతున్నాయిప్పుడు. కర్నూలుకు చెందిన మధుసూదన్ రెడ్డి శైలజారెడ్డి దంపతుల కుమార్తె రజిత. తెలంగాణ రాష్ట్రం నల్గొండకు చెందిన వెంకట్రామిరెడ్డి – కవితల కుమారుడు దినేష్ రెడ్డిల వివాహం కర్నూలులోని ఓ ఫంక్షన్ హాల్లో ఆన్ లైన్లో జరిగింది.

రజిత – దినేష్ రెడ్డిలకు రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిపించాలని ఇరుకుటుంబాల పెద్దలు నిర్ణయించారు. అయితే, వారిద్దరూ ఉద్యోగ రిత్యా ఆస్ట్రేలియాలోని డింబోలలో ఉండడంతో కరోనా నేపథ్యంలో వివాహం జరగలేదు. ఆస్ట్రేలియా నుండి ఇండియాకు వచ్చే పరిస్థితి లేనందున ఆన్ లైన్లో వివాహం జరిపించే విధంగా డిసైడయ్యారు.

పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె ఆస్ట్రేలియాలో కల్యాణ మండపంలో ఉండి కర్నూలులో వేద పండితుడు చరవాణిలో తెలిపిన విధంగా అచరించారు. పెండ్లిలో తమ కుమార్తె, కుమారుడు లేనందున బాధగా ఉన్నా.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వివాహం ఇలా జరిపించామని వివాహ పెద్దలు తెలిపారు.

నాగిరెడ్డి, టీవీ9 కర్నూలు ప్రతినిధి