Water Sports Festival: కశ్మీర్లో తొలిసారిగా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్.. నేడు దాల్ సరస్సులో ప్రారంభం.. పాల్గొననున్న 400 మందికి పైగా అథ్లెట్లు

జమ్మూ కాశ్మీర్ జల క్రీడలకు ముఖ్యమైన కేంద్రంగా మారడానికి సిద్ధమవుతోంది. ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ మొదటిసారిగా ఇక్కడి దాల్ సరస్సులో నిర్వహించబడుతోంది. ఈ ఉత్సవాలు ఈ రోజు నుంచి డి 23 వరకు జరుగనున్నాయి. వాటర్ స్కీయింగ్, డ్రాగన్ బోట్ రేస్ వంటి క్రీడలను నిర్వహించనున్నారు. ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ గురించి తెలుసుకుందాం.

Water Sports Festival: కశ్మీర్లో తొలిసారిగా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్.. నేడు దాల్ సరస్సులో ప్రారంభం.. పాల్గొననున్న 400 మందికి పైగా అథ్లెట్లు
Khelo India Water Sports Festival

Updated on: Aug 21, 2025 | 11:22 AM

కాశ్మీర్‌ను “భూతల స్వర్గం” అని పిలుస్తారు. ఈ ప్రదేశం సహజ సౌందర్యం, పచ్చని లోయలు, సరస్సుల అందం చూపరుల మనసును దోచుకుంటాయి. కొంతమంది కాశ్మీర్‌ను సందర్శించాలని కలలు కంటారు. జూన్ – ఆగస్టు మధ్య ఇక్కడ ఉష్ణోగ్రత 20 నుంచి 30°C వరకు ఉంటుంది. మిగిలిన సమయంలో వాతావరణం చల్లగా ఉంటుంది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఇక్కడ భారీ హిమపాతం కనిపిస్తుంది. ఈ అందమైన దృశ్యాన్ని చూడటానికి ప్రజలు దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. ఇక్కడ సందర్శించడానికి చాలా గొప్ప ప్రదేశాలు ఉన్నాయి.

చాలా మంది శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గామ్ , సోనామార్గ్ లను సందర్శించడానికి ఇష్టపడతారు. శ్రీనగర్ సరస్సులు, మొఘల్ తోటలు, చారిత్రక కట్టడాలు వంటి సహజ సౌందర్యానికి చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వులార్, మనస్బాల్, నిగీన్ వంటి అనేక సరస్సులు ఉన్నాయి. వీటిలో అత్యంత ప్రసిద్ధమైనది దాల్ సరస్సు. సరస్సులో తేలియాడే మార్కెట్లను ఇక్కడ చూడవచ్చు.

ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్
దాల్ సరస్సు తొలిసారిగా ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తోంది. ఈ ఉత్సవం 2025 ఆగస్టు 21 నుంచి 23 వరకు జరుగుతుంది. అంటే ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. కాశ్మీర్‌లోని అందమైన దాల్ సరస్సు జాతీయ క్రీడలకు కేంద్రంగా ఉండటం ఇదే మొదటిసారి. ఇందులో, 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 400 మందికి పైగా అథ్లెట్లు వాటర్ స్కీయింగ్, డ్రాగన్ బోట్ రేసులు, రోయింగ్, కనోయింగ్ , కయాకింగ్‌తో సహా హంటా స్ప్రింట్ వంటి వినోద ప్రదర్శన కార్యక్రమాలలో పాల్గొననున్నారు. దీంతో దాల్ సరస్సు మరింత అందంగా కనువిందు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, జమ్మూ కాశ్మీర్ స్పోర్ట్స్ కౌన్సిల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇది ‘ఖేలో ఇండియా’ విధానం ప్రత్యక్ష ఫలితం.. దీని ప్రధాన లక్ష్యం అట్టడుగు స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడం, జీవనోపాధిని సృష్టించడం, స్థానిక క్రీడా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం. ఈ ఉత్సవం అథ్లెట్లు, కోచ్‌లకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చడమే కాకుండా, హంటా ఇండిపెండెంట్లు, హౌస్‌బోట్ ఛాలెంజర్లు , విస్తృత పర్యాటక పర్యావరణ వ్యవస్థకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ ఉత్సవానికి సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

PIB ప్రకారం షికారా ఆపరేటర్ ,వాటర్ స్పోర్ట్స్ అథ్లెట్ మొహమ్మద్ రఫీక్ మల్లా ఈ పండుగను ఒక పెద్ద అవకాశంగా భావిస్తున్నారు. ఇది అథ్లెట్లకు మాత్రమే కాకుండా దాల్ సరస్సుతో అనుబంధించబడిన వారందరికీ ఒక కొత్త అవకాశం లాంటిదని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న యువ అథ్లెట్లు దాల్ సరస్సులో ఆడటం చూడాలని, కాశ్మీర్ పర్యటనను ఆస్వాదించాలని, దాల్ సరస్సులో జీవిత సందడిని చూడాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. ముఖ్యంగా దాల్ సరస్సులోని తోటలు, తులిప్ పువ్వులు , జబర్వాన్ పర్వతాల అందాలను ఆస్వాదించమని కోరుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..