Health Tips: కిడ్నీ సమస్యలు ఉన్నవారు పసుపు తీసుకుంటే ఏమవుతుందో తెలుసా.? మీరు ఊహించలేరు

మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కిడ్నీ ఒకటి. ఇది మన శరీరంలోని అనేక విధులకు సహాయపడుతుంది. నేటి కాలంలో కిడ్నీ వ్యాధుల కేసులు పెరుగుతున్నాయి. అటువంటి పరిస్థితిలో పసుపు కిడ్నీ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఒక పరిశోధనలో వెల్లడైంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Health Tips: కిడ్నీ సమస్యలు ఉన్నవారు పసుపు తీసుకుంటే ఏమవుతుందో తెలుసా.? మీరు ఊహించలేరు
Turmeric For Kidney Health

Updated on: Sep 04, 2025 | 6:06 PM

మూత్రపిండాలు మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం. రక్తాన్ని శుద్ధి చేసి, శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా నీరు, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడడం, రక్తపోటును నియంత్రించడం వంటి పనులను కూడా కిడ్నీలు నిర్వర్తిస్తాయి. అయితే ఆధునిక జీవనశైలి, అధిక ఉప్పు వాడకం, అధిక రక్తపోటు, మధుమేహం, నొప్పి నివారణ మందులను దీర్ఘకాలం వాడడం వంటి కారణాల వల్ల మూత్రపిండాలు బలహీనపడతాయి. దీనివల్ల శరీరంలో విషపదార్థాలు పేరుకుపోయి కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

కిడ్నీ సమస్యలుంటే కనిపించే లక్షణాలు

కిడ్నీ వ్యాధులు ప్రారంభ దశలో ఉన్నప్పుడు శరీరం, రక్తం, నీటి సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల పాదాలు, చేతులు, ముఖంపై వాపు వస్తుంది. అలసట, బలహీనత, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు పెరుగుతాయి. వ్యాధి తీవ్రమైతే అధిక రక్తపోటు, ఎముకల బలహీనత, గుండె సమస్యలు కూడా వస్తాయి. వ్యాధి ముదిరితే, రక్తంలో యూరియా, క్రియాటినిన్ స్థాయిలు పెరిగి డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి అవసరం కావచ్చు. దీంతోపాటు రక్తహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు కూడా పెరుగుతాయి.

పసుపుతో కిడ్నీ వ్యాధులకు చెక్..

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం ప్రకారం.. పసుపులో ఉండే కర్కుమిన్ అనే మూలకం కిడ్నీ వాపు, ఇన్ఫెక్షన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. పసుపులో ఉండే యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కిడ్నీ కణాలను హానికరమైన మూలకాల నుంచి రక్షిస్తాయి. మధుమేహం, అధిక రక్తపోటును నియంత్రించడంలో కూడా కర్కుమిన్ సహాయపడుతుందని పరిశోధనలు వెల్లడించాయి.

పసుపును పరిమితంగా తీసుకోవడం వల్ల కిడ్నీల వడపోత సామర్థ్యం మెరుగుపడుతుంది. శరీరంలోని విషపదార్థాలు బయటకు సులభంగా వెళ్తాయి. అలసట, బలహీనత వంటి లక్షణాలను కూడా పసుపు తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే పసుపును వైద్యుల సలహా మేరకు మాత్రమే పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. ఎందుకంటే అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు.

కిడ్నీల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

ఉప్పు, ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించండి.

రోజుకు సరిపడా నీటిని తాగాలి.

రక్తంలో చక్కెర, రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి.

వైద్యుల సలహా లేకుండా మందులు వాడకూడదు.

పసుపును పరిమిత పరిమాణంలో ఆహారంలో భాగం చేసుకోండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..