Anjeer Benefits: రోజూ ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తింటే సులభంగా బరువు తగ్గుతారు.. డయబెటీస్ రోగులకు ఎన్నో ప్రయోజనాలు..

|

Jun 11, 2021 | 12:40 PM

ప్రస్తుతం కరోనా క్లిష్ట పరిస్థితులలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం అతి ముఖ్యమైన పని. ఎలాంటి వ్యాధులు లేనివారు కరోనా నియంత్రణకు అనేక

Anjeer Benefits: రోజూ ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తింటే సులభంగా బరువు తగ్గుతారు.. డయబెటీస్ రోగులకు ఎన్నో ప్రయోజనాలు..
Anjeer Fruits
Follow us on

ప్రస్తుతం కరోనా క్లిష్ట పరిస్థితులలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం అతి ముఖ్యమైన పని. ఎలాంటి వ్యాధులు లేనివారు కరోనా నియంత్రణకు అనేక రకాల ఆహార పదార్థాలను, కషాయాలను తీసుకోవచ్చు. కానీ.. ఇతర వ్యాధులు ఉన్నవారు కషాయాలు ఎక్కువగా తీసుకోవడం కొంత వరకు ఆలోచించాల్సిన విషయమే. ఇదిలా ఉంటే.. అంజీర్ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి తెలిసిందే. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో ఈ పండ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇందులో జింక్, మాంగనీస్, మెగ్నీషియం, ఇనుము వంటి ఖనిజాలు పోషకాలు కలిగి ఉంటాయి. రోజూ నానబెట్టిన అంజీర్ పండ్లను తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలున్నాయి. రాత్రిళ్లు ఒకటి లేదా రెండు అంజీర్ పండ్లను నానబెట్టి.. ఉదయాన్నే పరగడపున తీసుకోవడం వలన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. పీఎంఎస్ సమస్యతో బాధపడుతున్న మహిళలకు ఆంజీర్ పండ్లు మేలు చేస్తాయి. అలాగే హార్మోన్ల అసమతుల్యతను, మెనోపాజ్ సమస్యలకు ఆంజీర్ పండ్లు తినడం మంచింది.

షుగర్ లెవల్స్ కంట్రోల్..
ఆంజీర్ పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో షుగర్ లెవల్స్ నియంత్రిస్తుంది. ఇందులో ఉండే.. క్లోరోజెనిక్ ఆమ్లం షుగల్ లెవల్స్ తగ్గించడంలో సహాయపడుతుందని అనేక అధ్యాయనాల్లో తెలీంది. నానబెట్టిన ఆంజీర్ పండ్లను తినడం వలన టైప్ 2 డయాబెటిస్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కూడా నియంత్రిస్తుంది.

మలబద్ధకాన్ని నివారిస్తుంది…
ఇందులో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది. ఆంజీర్ పండ్లను ఎక్కువగా తినడం వలన ఆరోగ్యకరమైన గట్ ను కాపాడుకోవచ్చు.

బరువు తగ్గిస్తుంది..
బరువు తగ్గడంలో కోసం డైటింగ్ చేస్తున్న వారు ఆంజీర్ పండ్లను తినడం మంచిది. ఇందులో ఉంటే ఫైబర్ బరువు తగ్గించడంలో సహయపడుతుంది. ఇందులో తక్కువగా కేలరీలు ఉంటాయి. కానీ ఆంజీర్ పండ్లను మితంగా తీసుకోవాలి.. మరీ ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు.

గుండె ఆరోగ్యానికి..
ఆంజీర్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది. శరీరంలోని ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించడంలో ఆంజీర్ పండ్లు సహయపడతాయని అధ్యాయనాలు చెబుతున్నాయి.

ఎముకలు ఆరోగ్యం..
ఇందులో ఎక్కువగా కాల్షియం ఉంటుంది. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి సహయపడతాయి. శరీరంలో స్వయంగా కాల్షియం ఉత్పత్తి కాదు.. అందుకే పాలు, సోయా, పచ్చి ఆకు కూరలు, ఆంజీర్ పండ్లు తీసుకోవడం మంచిది.

Also Read: AP CM Jagan: ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ టూర్.. విజయవాడకు తిరుగు పయనం.. రెండు రోజుల్లో ఆరుగురు మంత్రులతో భేటీ!