
ఈ ఆలూ కుర్మా కేవలం రుచికరమైనది మాత్రమే కాదు, పచ్చి బఠానీలు కలపడం వల్ల ఆరోగ్యకరమైనది కూడా. ఇందులోని అసలు రహస్యం మనం రుబ్బుకునే మసాలా పేస్ట్ లోనే ఉంది. జీడిపప్పు, గసగసాలు కొబ్బరి కలయికతో తయారయ్యే ఈ మసాలా, కుర్మాకు ఆ సిల్కీ టెక్స్చర్ రిచ్ టేస్ట్ ను అందిస్తుంది. మీ ఇంటిని రెస్టారెంట్ లా మార్చే ఆ సింపుల్ రెసిపీ ఏంటో చూద్దాం..
కావలసిన పదార్థాలు:
బంగాళదుంపలు (4-5),
పచ్చి బఠానీలు (½ కప్పు),
ఉల్లిపాయలు,
టమోటాలు.
జీలకర్ర,
పసుపు,
కారం,
ధనియాల పొడి,
గరం మసాలా.
స్పెషల్ మసాలా పేస్ట్ కోసం: జీడిపప్పు (10-12), గసగసాలు (1 టేబుల్ స్పూన్), పచ్చి కొబ్బరి ముక్కలు, లవంగాలు, చెక్క, వెల్లుల్లి, అల్లం.
తయారీ విధానం
ముందుగా జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి మసాలా దినుసులను కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇదే ఈ కుర్మాకు అసలైన రుచిని ఇస్తుంది.
బాణలిలో నూనె వేడి చేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు రంగు మారాక టమోటా ముక్కలు, పసుపు, ఉప్పు వేసి మెత్తగా ఉడికించాలి.
కట్ చేసిన బంగాళాదుంప ముక్కలు బఠానీలు వేసి బాగా కలిపి, మూతపెట్టి 8-10 నిమిషాలు మగ్గనివ్వాలి. ముక్కలు సగం ఉడికిన తర్వాత మనం సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ ను ఇందులో కలపాలి.
ఇప్పుడు కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి తగినన్ని నీళ్లు పోయాలి. గ్రేవీ చిక్కబడే వరకు అంటే మరో 10-12 నిమిషాలు మీడియం మంట మీద మరిగించాలి.
చివరగా కొద్దిగా నెయ్యి లేదా వెన్న వేసి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే, వేడివేడి హోటల్ స్టైల్ ఆలూ కుర్మా సిద్ధం!