
ఇంట్లో చేసే కూరలను చూసి పిల్లలు పెద్దలు కూడా రోజూ ఇదే తినాలా అంటూ వాపోతారు. దీంతో డిఫరెంట్ టేస్ట్ కోసం రెస్టారెంట్ కు స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తారు. ఇలా ఫ్యామిలీ తో కలిసి రెస్టారెంట్ కు వెళ్ళడం ఖర్చుతో కూడుకున్నది. అంతేకాదు ప్రస్తుతం రెస్టారెంట్ లో ఆహారం తయారీ కోసం ఉపయోగిస్తున్న పదార్ధాల గురించి రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఇంట్లో రెస్టారెంట్ స్టైల్ లో డిఫరెంట్ కూరలను తయారు చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ రోజు కాజు పన్నీర్ మసాలా కూరని తక్కువ సమయంలోనే మంచి టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..
జీడి పప్పు- రెండు కప్పులు
ఉల్లిపాయ – 2
టమాటా -2
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్
మిరియాల పొడి- కొంచెం
ధనియా పొడి- ఒక టీ స్పూన్
జీలకర్ర పొడి- అర టీ స్పూన్
కారం – ఒక టీ స్పూన్
గరం మసాలా – ఒక టీ స్పూన్
నెయ్యి-
నూనె
ఉప్పు – రుచికి సరిపడా
కొత్తిమీర – కొంచెం
ఫ్రెష్ క్రీమ్- రెండు స్పూన్లు
తయారీ విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పావు కప్పు జీడిపప్పు వేసి వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఇంతలో పన్నీర్ ని ఒక గిన్నెలోకి తీసుకుని కొంచెం వేడి నీరు వేసి ఉప్పు వేసి పక్కకు పెట్టుకోవాలి. ఒక పది నిమిషాల తర్వాత పన్నీర్ శుభ్రంగా కడిగి కావాల్సిన సైజ్ లో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి కొంచెం నెయ్యి వేసి వేడి చేసి కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేయించుకోవాలి. వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు పాన్ లో నెయ్యి, కొంచెం నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ లోకి ఉల్లిపాయ ముక్కలు వచ్చిన తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి వేయించాలి. టమాటా మెత్త పడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఉల్లి టమాటా మిశ్రమంలో కొంచెం మిరియాల పొడి, ధనియా పొడి, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా, కొంచెం ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ ఉల్లి, టమాటా మసాలా పేస్ట్ వేయిస్తుంటే నూనె పైకి వస్తుంది.. ఇంతలో వేయించి పక్కకు పెట్టుకున్న జీడి పప్పులను మిక్సీ చేసి క్రీమ్ గా చేసుకుని దీనిని మసాలా కూరలో వేసుకోవాలి.
చివరిగా జీడిపప్పుని, వేయించిన పన్నీర్ వేసుకుని ఉడికించాలి. నూనె పైకి వచ్చే సమయంలో గరం మసాలా పొడి, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలపాలి. చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ధాబా స్టైల్ లో కాజు పనీర్ మసాలా కూర రెడీ. దీనిని బిర్యానీ, చపతీ, నాన్, పరాటా లో వేసి సర్వ్ చేసుకోవాలి. ఆహా ఏమి రుచి అంటూ ఒకటికి రెండు చపాతీలు అడిగిమరీ తినేస్తారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..