
కానీ, కూరగాయల్లో రారాజైన బీట్రూట్, ప్రోటీన్ గని అయిన పనీర్ కలిపి చేసే ఈ స్పెషల్ దోశ తింటే మీ ఆరోగ్యానికి తిరుగుండదు. కేవలం రుచిలోనే కాదు, రక్తహీనతను తగ్గించడంలోనూ ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
చాలా మంది పిల్లలు బీట్రూట్ కూర అంటే ముఖం చాటేస్తుంటారు. కానీ అదే బీట్రూట్ను ఈ వినూత్న పద్ధతిలో దోశలా చేసి పెడితే ప్లేట్లు ఖాళీ అవ్వాల్సిందే. ఎర్రగా మెరిసిపోయే ఈ దోశ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, శరీరానికి కావాల్సిన హిమోగ్లోబిన్ను పుష్కలంగా అందిస్తుంది. పనీర్ కలయిక వల్ల ఇది తిన్న తర్వాత చాలా సేపు ఆకలి వేయదు. మరి ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగలిగే ఈ ప్రోటీన్ పవర్ హౌస్ దోశ తయారీ విధానం తెలుసుకుందాం..
ఈ దోశ తయారీకి ఒక మధ్యస్థ బీట్రూట్, 100 గ్రాముల పనీర్, ఒక కప్పు శెనగపిండి సిద్ధం చేసుకోవాలి. రుచి కోసం ఒక ఉల్లిపాయ, రెండు పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, అర స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర తురుము ఉండాలి. వీటితో పాటు రుచికి సరిపడా ఉప్పు, అవసరమైనంత నీరు, కాల్చడానికి నెయ్యి లేదా నూనె తీసుకోవాలి.
ఆరోగ్యం కోసం కష్టపడాల్సిన అవసరం లేదు, మనం తినే ఆహారంలో చిన్న మార్పులు చేసుకుంటే చాలు. ఈ బీట్రూట్ పనీర్ దోశను పుదీనా చట్నీ లేదా అల్లం పచ్చడితో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.