AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: భోజనం చేయగానే పండ్లు తింటున్నారా.? నిపుణులు ఏమంటున్నారంటే..

పండ్లను భోజనానికి అరగంట ముందు తింటే శరీరానికి పుష్కలంగా పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అదే భోజనం తర్వాత పండ్లను తింటే, పండ్లలోని అదనపు కేలరీలు ఆహారంతో పాటు శరీరంలోకి వెళ్తాయని, ఇది ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. అలాగే రాత్రి పడుకునే ముందు ఉదయం లేవగానే పండ్లను...

Lifestyle: భోజనం చేయగానే పండ్లు తింటున్నారా.? నిపుణులు ఏమంటున్నారంటే..
Food
Narender Vaitla
|

Updated on: Apr 13, 2024 | 9:04 PM

Share

ఆరోగ్యానికి పండ్లు ఎంతో మేలు చేస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే వైద్యులు సైతం పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా సీజన్‌లో లభించే పండ్లను తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని చెప్తారు. అయితే పండ్లను తీసుకునే సమయంలో కొన్ని నియమాలు పాటించాలని మీకు తెలుసా.? మనలో చాలా భోజనం చేయగానే పండ్లను తీసుకుంటారు. మరి ఇలా తీసుకోవడం వల్ల ఏమైనా నష్టం ఉంటుందా.? అసలు పండ్లను ఎప్పుడు తినాలి లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

పండ్లను భోజనానికి అరగంట ముందు తింటే శరీరానికి పుష్కలంగా పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అదే భోజనం తర్వాత పండ్లను తింటే, పండ్లలోని అదనపు కేలరీలు ఆహారంతో పాటు శరీరంలోకి వెళ్తాయని, ఇది ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. అలాగే రాత్రి పడుకునే ముందు ఉదయం లేవగానే పండ్లను తీసుకోకూడదని చెబుతున్నారు. మధ్యాహ్నం, సాయంత్రం పండ్లను తీసుకోవడానికి బెస్ట్‌ సమయంగా చెబుతున్నారు.

భోజనం చేయగానే ఎట్టి పరిస్థితుల్లో పండ్లను తీసుకోకూడదు. దీనికి కారణం భోజనం చేయగానే శరీరంలో కేలరీలు ఉంటాయి. తీసుకున్న ఆహారం జీర్ణమయ్యే కంటే ముందే మళ్లీ పండ్లను తీసుకుంటే.. జీర్ణ వ్యవస్థపై రెట్టింపు భారం పడుతుంది. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అజీర్ణం, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన వెంటనే ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో అనేక రకాల టాక్సిన్స్ పేరుకుపోతాయని చెబుతున్నారు. దీని ప్రభావం పొట్టపైనే కాదు చర్మంపై కూడా కనిపిస్తుంది.

భోజనం చేసే కంటే కనీసం రెండు గంటల ముందు లేదా భోజనం చేసిన 2 గంటల తర్వాత పండ్లను తీసుకోవడం బెస్ట్‌ అని చెబుతున్నారు. ఇక ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య పండ్లను తీసుకోవాలని చెబుతున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల మధ్య పండ్లను తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
రూ.1 కోటికి కొంటే రూ. 40 కోట్ల రాబడి.. ముట్టుకుంటే షాకే..!
రూ.1 కోటికి కొంటే రూ. 40 కోట్ల రాబడి.. ముట్టుకుంటే షాకే..!
రైతు భరోసా డబ్బుల కోసమని బ్యాంకెళ్లిన రైతు.. అకౌంట్‌ చెక్‌ చేయగా
రైతు భరోసా డబ్బుల కోసమని బ్యాంకెళ్లిన రైతు.. అకౌంట్‌ చెక్‌ చేయగా
ఓటీటీని షేక్ చేస్తోన్నకొరియన్ థ్రిల్లర్ సిరీస్.. పెద్దలకు మాత్రమే
ఓటీటీని షేక్ చేస్తోన్నకొరియన్ థ్రిల్లర్ సిరీస్.. పెద్దలకు మాత్రమే
వారెవ్వా హారిక.. కుగ్రామం నుంచి కామన్వెల్త్ గోల్డ్ మెడల్ వరకు..
వారెవ్వా హారిక.. కుగ్రామం నుంచి కామన్వెల్త్ గోల్డ్ మెడల్ వరకు..
ఈ పాముతో చాలా జాగ్రత్త బాబోయ్...
ఈ పాముతో చాలా జాగ్రత్త బాబోయ్...
మాయదారి వాన.. ముగ్గుర్ని బలి తీసుకుంది.. అంతేకాదు ఆ ప్రాంతమంతా..
మాయదారి వాన.. ముగ్గుర్ని బలి తీసుకుంది.. అంతేకాదు ఆ ప్రాంతమంతా..
దేవుడా కాస్త కూడా జాలి కలగలేదా.. పెళ్లి సంబరంతో కలకలలాడాల్సిన ఇంట
దేవుడా కాస్త కూడా జాలి కలగలేదా.. పెళ్లి సంబరంతో కలకలలాడాల్సిన ఇంట
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
ఎముకలు స్టీల్ లా మారాలంటే మఖానా తప్పనిసరి… ఎందుకో తెలుసుకోండి!
ఎముకలు స్టీల్ లా మారాలంటే మఖానా తప్పనిసరి… ఎందుకో తెలుసుకోండి!
ఏం అదృష్టం రా బాబు.. ఈ నాలుగు రాశుల వారికి పండుగే పండుగ!
ఏం అదృష్టం రా బాబు.. ఈ నాలుగు రాశుల వారికి పండుగే పండుగ!