గుండె పోటుకు కారణమవుతున్న డీజే సౌండ్స్..?
డీజే సౌండ్తో గుండెపోటు వస్తుందా అంటే కచ్చితంగా వస్తుందని ఇటీవల కాలంలో మరోసారి నిరూపణ అయ్యింది. నిజామాబాద్లో పెళ్లి జరిగి కొన్ని గంటలు కూడా గడవకముందే వరుడు ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లి తరువాత జరిగిన బారాత్లో నిర్వహించిన డీజే సౌండ్తో వరుడికి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తరలించినా.. ఆ లోపే కన్నుమూశాడు వరుడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. అయితే ఇదొక్కటే కాదు.. 2018లో సూర్యాపేటలో జరిగిన పెళ్లి ఊరేగింపులో గుండెపోటుతో ఈ లోకాన్ని […]
డీజే సౌండ్తో గుండెపోటు వస్తుందా అంటే కచ్చితంగా వస్తుందని ఇటీవల కాలంలో మరోసారి నిరూపణ అయ్యింది. నిజామాబాద్లో పెళ్లి జరిగి కొన్ని గంటలు కూడా గడవకముందే వరుడు ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లి తరువాత జరిగిన బారాత్లో నిర్వహించిన డీజే సౌండ్తో వరుడికి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తరలించినా.. ఆ లోపే కన్నుమూశాడు వరుడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. అయితే ఇదొక్కటే కాదు.. 2018లో సూర్యాపేటలో జరిగిన పెళ్లి ఊరేగింపులో గుండెపోటుతో ఈ లోకాన్ని వదిలి వెళ్లింది ఓ వధువు. డీజే శబ్దం ఎక్కవగా ఉండటం వలనే ఆమెకు గుండెపోటు వచ్చినట్లు తేలింది.
అయితే పెళ్లిళ్లు, వివిధ శుభకార్యాలు, రాజకీయ పార్టీల ఊరేగింపు.. ఇలా పలు కార్యక్రమాలలో ఇటీవల డీజేలను విరివిగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల గుండె చాలా వీక్గా ఉన్న వాళ్లకు హార్ట్ ఎటాక్ వస్తుందని డాక్టర్లు అంటున్నారు. అందువల్లే చాలా మంది మృతి చెందుతున్నారని వారు చెబుతున్నారు. ఇదిలా ఉంటే శబ్ద తరంగాలను నియంత్రించేందుకు చట్టం కూడా అందుబాటులో ఉంది. దాని ప్రకారం ఈ సమయం నుంచి ఈ సమయం వరకే ఇంత శబ్దతరంగాలను ఉపయోగించుకొని వేడుకలు చేసుకోవాలని ఉంది. కానీ ప్రజలు అవేమీ పట్టించుకోవడం లేదు. అధికారులు కూడా వాటిని చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు. దీంతో ఈ చట్టం సరిగా అమలు కాకపోవడంతో.. రోజురోజుకు శబ్ద కాలుష్యం పెరుగుతోంది. దీని వలన పలు రకాల రోగాల బారిన పడటమే కాకుండా ప్రకృతిలోనూ బతికే జీవాలు అంతరించిపోతున్నాయంటున్నారు నిపుణులు.