
నేటి అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా చాలా మంది నిద్రలేచిన వెంటనే..వారి మొబైల్ ఫోన్లను చూస్తుంటారు. ఇది ఒత్తిడిని, అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో ఉదయాన్నే తాజా గాలిలో కొన్ని నిమిషాల పాటు వాకింగ్ చేయటం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. ఈ అలవాటు శరీరానికి శక్తినివ్వడమే కాకుండా మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుంది. ఉదయం గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం మరీ మంచిదని చెబుతున్నారు.
ఉదయాన్నే మంచులో నడవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి?
డాక్టర్ అమిత్ వర్మ ప్రకారం, ఉదయం మంచులో గడ్డి మీద చెప్పులు లేకుండా నడవడం వల్ల మన పాదాలు భూమితో ప్రత్యక్ష సంబంధంలో ఉంటాయి. ఇది శరీర శక్తిని సమతుల్యం చేస్తుంది. అనేక వ్యాధులను నివారిస్తుంది. ఉదయం మంచులో గడ్డి మీద చెప్పులు లేకుండా నడవడం వల్ల కంటి చూపు, మానసిక ఆరోగ్యం, రక్త ప్రసరణ, రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఇంకా, పాదాల వాపు, అధిక రక్తపోటుకు చెప్పులు లేకుండా నడవడం ప్రయోజనకరంగా ఉంటుంది.
మీరు గడ్డి మీద చెప్పులు లేకుండా నడిస్తే ఏమి జరుగుతుంది?
గడ్డి మీద చెప్పులు లేకుండా నడవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. నిద్రను మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. గడ్డి మీద చెప్పులు లేకుండా నడవడం వల్ల శరీరానికి సహజ శక్తి లభిస్తుంది. మానసిక ప్రశాంతత పెంపొందుతుంది.
ఎప్పుడు, ఎలా మంచులో నడవాలి:
ఉదయాన్నే నిద్రలేచి, మంచుతో తడిసిన పచ్చని గడ్డిపై కనీసం 15-30 నిమిషాలు చెప్పులు లేకుండా నడవండి. శీతాకాలం, వేసవి రెండింటిలోనూ ఇది సహజమైన వైద్యం చికిత్స. ఇలా చేయడం వల్ల అనారోగ్యాన్ని నివారించడంలో సహాయపడుతుంది. శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
మరిన్ని లైఫ్స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..