YSR Bheema Scheme: పేదల సంక్షేమమే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ‘వైఎస్సార్ బీమా పధకానికి శ్రీకారం చుట్టింది. ఈ పధకానికి సంబంధించిన విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం రూప కల్పన చేసింది. 18-70 ఏళ్లు వయస్సు ఉన్నవారికి ఈ పధకం వర్తించనుండగా.. బియ్యం కార్డు ఉండి, కుటుంబం ఆధారపడ్డ వ్యక్తికి దురదష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం, లేదా సహజ మరణం చెందితే ఆ కుటుంబానికి ఈ బీమా వర్తిస్తుందని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ పథకం కింద 18–50 ఏళ్ల మధ్య వయసున్న వారు సహజంగా చనిపోతే అతడి కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం.. శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తూ మరణం సంభవిస్తే రూ.5 లక్షలు ఇవ్వనున్నారు. అలాగే 51–70 ఏళ్ల వయస్సు వారు ప్రమాదంలో శాశ్వత వైకల్యం పొందినా లేదా ప్రమాదవశాత్తూ మరణించినా బాధిత కుటుంబాలకు రూ.3 లక్షలను అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటిన్నర మంది ఈ పధకం పరిధిలోకి వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అటు లబ్దిదారుల గుర్తింపును గ్రామ/ వార్డు వాలంటీర్లు చేపట్టనుండగా.. ఎంపికైన వారందరికీ ప్రభుత్వం యూనిక్ ఐడీ నెంబర్ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇక జిల్లాల వారీగా కాల్ సెంటర్ల నెంబర్లు ఈ విధంగా ఉన్నాయి.
Also Read: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్…