వివేకా హత్య కేసు: ఎవరీ పరమేశ్వర్ రెడ్డి..?

| Edited By: Pardhasaradhi Peri

Mar 21, 2019 | 10:08 AM

మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిట్ అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు పదిమందిని అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. వైఎస్ వివేకా సన్నిహితులను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఈ కేసులో కుసునూరు పరమేశ్వర్ రెడ్డి పేరు బయటకు వచ్చింది. ఎవరీ పరమేశ్వర్ రెడ్డి..? వివేకానంద రెడ్డి హత్యతో పరమేశ్వర్ రెడ్డికి సంబంధం ఏంటి..? అనే అంశాలు కీలకంగా మారాయి. వైఎస్ కుటుంబానికి చాలా సన్నిహితుడైన […]

వివేకా హత్య కేసు: ఎవరీ పరమేశ్వర్ రెడ్డి..?
Follow us on

మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిట్ అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు పదిమందిని అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. వైఎస్ వివేకా సన్నిహితులను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఈ కేసులో కుసునూరు పరమేశ్వర్ రెడ్డి పేరు బయటకు వచ్చింది. ఎవరీ పరమేశ్వర్ రెడ్డి..? వివేకానంద రెడ్డి హత్యతో పరమేశ్వర్ రెడ్డికి సంబంధం ఏంటి..? అనే అంశాలు కీలకంగా మారాయి.

వైఎస్ కుటుంబానికి చాలా సన్నిహితుడైన పరమేశ్వర్ రెడ్డి, వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు నుంచి కనిపించకుండా పోయారు. వివేకాను అంటిపెట్టుకొని ఉండే పరమేశ్వర్ రెడ్డి ఇప్పుడు పరారీలో ఉండటంతో అనుమానాలకు తావిస్తోంది. అయితే వివేకా హత్యపై దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు, సన్నిహితులను విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివేకా సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించిన క్రమంలో పరమేశ్వర్ రెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది. కాగా ప్రస్తుతం ఆయన తిరుపతిలో ఉన్నట్లు తెలుస్తోంది.