చెన్నైలో జగన్ కొత్త ప్యాలెస్ : నారా లోకేష్

|

Oct 30, 2020 | 6:30 PM

హైదరాబాద్, బెంగళూరు, తాడేపల్లిలో ఇప్పటికే భారీ ప్యాలెస్ లు కట్టుకున్న జగన్ ఇప్పుడు చెన్నైలో కూడా మరో ప్యాలెస్ కట్టుకుంటున్నారని టీడీపీ నేత నారా లోకేష్ చెప్పారు. కేసుల నుంచి బయటపడేందుకే బీజేపీ హైకమాండ్ కు జగన్ లొంగిపోయారని, పోలవరం అంచనాలను కుదించారని విమర్శించారు. వైసీపీకి చేతకాని 22 మంది ఎంపీలు ఉన్నారని… వారి వల్ల పోలవరం ప్రాజెక్టుకు రూ. 30 వేల కోట్లు నష్టపోయామని తెలిపారు. రూ. 4 వేల కోట్లు అప్పు తెచ్చుకోవడం కోసం […]

చెన్నైలో జగన్ కొత్త ప్యాలెస్ : నారా లోకేష్
Follow us on

హైదరాబాద్, బెంగళూరు, తాడేపల్లిలో ఇప్పటికే భారీ ప్యాలెస్ లు కట్టుకున్న జగన్ ఇప్పుడు చెన్నైలో కూడా మరో ప్యాలెస్ కట్టుకుంటున్నారని టీడీపీ నేత నారా లోకేష్ చెప్పారు. కేసుల నుంచి బయటపడేందుకే బీజేపీ హైకమాండ్ కు జగన్ లొంగిపోయారని, పోలవరం అంచనాలను కుదించారని విమర్శించారు. వైసీపీకి చేతకాని 22 మంది ఎంపీలు ఉన్నారని… వారి వల్ల పోలవరం ప్రాజెక్టుకు రూ. 30 వేల కోట్లు నష్టపోయామని తెలిపారు. రూ. 4 వేల కోట్లు అప్పు తెచ్చుకోవడం కోసం వ్యవసాయ బోర్లకు మీటర్ల బిగింపుకు జగన్ ప్రభుత్వం సిద్ధపడిందని లోకేష్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం వ్యవసాయ కరెంటుకు మీటర్లను బిగిస్తే… తాము వాటిని పీకేస్తామని.. సైకిళ్లకు మీటర్లు కట్టి ఊరేగిస్తామని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు .