తెరుచుకున్న యాదాద్రి ఆలయం

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల దర్శించుకుంటున్నారు. ఈ ఉదయం నుంచి భక్తలకు అనుమతి ఇచ్చారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో గత మూడు రోజుల పాటు

తెరుచుకున్న యాదాద్రి ఆలయం

Updated on: Sep 12, 2020 | 11:09 AM

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల దర్శించుకుంటున్నారు. ఈ ఉదయం నుంచి భక్తలకు అనుమతి ఇచ్చారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో గత మూడు రోజుల పాటు దేవాదాయశాఖ అధికారులు భక్తుల దర్శనాలకు అనుమతిని నిలిపివేశారు. ఈరోజు యధావిధిగా ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉచిత, లఘు దర్శనాలకు అధికారులు అనుమతినిచ్చారు.

కరోనా తీవ్రత ఎక్కువ అవుతుండటంతో ముందు జాగ్రత్తగా ఆలయాన్ని మూసివేశారు. ఈ నెల 9వ తేదీ నుంచి స్వామివారి కైంకర్యాలను ఏకాంతంగానే నిర్వహించారు. భక్తులెవరూ ఆలయానికి అనుమతి ఇవ్వలేదు. ఇటీవల ఆలయంలోని ప్రధానార్చకులతో పాటు మరో ఇద్దరు అర్చకులు, సిబ్బందికి పాజిటివ్ అని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఆలయాన్ని పూర్తిగా శానిటైజేషన్ చేశారు. ఇబ్బంది ఉండకుండా ముందు జాగ్రత్తగా మూడు రోజులు మూసివేయాలని నిర్ణయించారు. కాగా ఆలయంలో కరోనా విజృంభించడంతో స్థానికులతో పాటు భక్తుల్లో ఆందోళన మొదలైంది.

Loading...
Unable to load recommendations.
Follow Us