ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ కరోనా బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సంతమాగులూరు మండలం పాతమాగులూరుకు చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆమెను ఒంగోలులోని రైస్ కళాశాల ఐసోలేషన్ సెంటర్లో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన ఆమె… ఐసోలేషన్ సెంటర్ నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read :
కృష్ణాజిల్లాలో కొత్తగా 8 కంటైన్మెంట్ జోన్లు
ఏపీ ప్రజలకు అలెర్ట్ : ఆ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం