అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్, ఉపాధ్యక్షురాలిగా నేను బాధ్యతలు చేపట్టిన వెంటనే కరోనా వైరస్ నియంత్రణ చర్యలు చేపట్టడమే మా ప్రథమ ప్రాధాన్యమని కమలా హారిస్ అన్నారు. ఆ మహమ్మారి నుంచి దేశ పౌరులను రక్షించేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. దేశంలో ధ్రువీకరణ పత్రాలు లేకుండా ఉన్న ‘డ్రీమర్స్’ను కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. 11మిలియన్ల మందికి పౌరసత్వం కల్పించే విధంగా బిల్లు రూపొందించి కాంగ్రెస్కు పంపుతామని స్పష్టం చేశారు. అంతేకాకుండా పారిస్ వాతావరణ ఒప్పందంలోకి తిరిగి అమెరికాను తిరిగి చేర్చేందుకు చర్యలు తీసుకుంటాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే’ అంటూ హారిస్ ట్వీట్లో పేర్కొన్నారు.