AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నవరాత్రులు ఎందుకు జరుపుకోవాలంటే…!

నవరాత్రులు ప్రతి ఏడాది అట్టహాసంగా జరుపుకుంటాం. అలాంటి నవరాత్రులను జరుపుకునేందుకు వెనకున్న కథేంటో మీకు తెలుసా? అయితే చదవండి. ”నవ” అనే పదానికి కొత్త, తొమ్మిది అనే రెండు అర్థాలున్నాయి. శంభుడు, నిశంభుడిని సంహరించేందుకు దుర్గాదేవి తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి పదో రోజున ఆ రాక్షసులపై విజయం సాధించింది. అందుకే నవరాత్రుల్లో తొమ్మిది రోజులతో పాటు పదవ రోజున విజయ దశమిని జరుపుకుంటారు. విజయదశమి రోజునే రావణాసురుడిని శ్రీ రాముడు వధించాడని పురాణాలు చెప్తుంటాయి. శంభుడు, […]

నవరాత్రులు ఎందుకు జరుపుకోవాలంటే...!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 01, 2019 | 5:54 AM

Share

నవరాత్రులు ప్రతి ఏడాది అట్టహాసంగా జరుపుకుంటాం. అలాంటి నవరాత్రులను జరుపుకునేందుకు వెనకున్న కథేంటో మీకు తెలుసా? అయితే చదవండి. ”నవ” అనే పదానికి కొత్త, తొమ్మిది అనే రెండు అర్థాలున్నాయి. శంభుడు, నిశంభుడిని సంహరించేందుకు దుర్గాదేవి తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి పదో రోజున ఆ రాక్షసులపై విజయం సాధించింది. అందుకే నవరాత్రుల్లో తొమ్మిది రోజులతో పాటు పదవ రోజున విజయ దశమిని జరుపుకుంటారు. విజయదశమి రోజునే రావణాసురుడిని శ్రీ రాముడు వధించాడని పురాణాలు చెప్తుంటాయి.

శంభుడు, నిశంభుడు అనే రాక్షసులు బ్రహ్మదేవుని నుంచి తమకు మరణం లేని వరం కావాలని కోరుకుంటారు. అయినప్పటికీ తమకు సమమైన, ధైర్యవంతురాలైన, శక్తిమంతురాలైన మహిళ చేతిలో తమకు మరణం సంభవించాలని కోరుకుంటారు. బ్రహ్మదేవుడు ఆ వరాలను రాక్షసులకు ప్రసాదిస్తాడు. ఈ వరాల మహిమను గుర్తించని శంభు, నిశంభులకు గర్వం తలకెక్కి… దేవతలను హింసించడం మొదలెట్టారు.

కానీ వారి అరాచకాలకు మట్టుబెట్టేందుకు ఆదిపరాశక్తి కౌశిక, కాళికా, కళరాత్రిగా ఉద్భవించింది. కాళికా దేవికి సహాయంగా ముగ్గురమ్మల రూపమైన అష్టమాధులు, అష్టరాత్రులుగా ఉద్భవించారు. బ్రాహ్మణి అనే బ్రహ్మశక్తి హంస వాహనంలో, కమండలంతో వైష్ణవి అనే విష్ణు శక్తి గరుడ వాహనంలో, శంఖుచక్రాలు, తామరపువ్వులు మహేశ్వరి అనే రూపంలో వృషభ వాహనంలో త్రిశూలం, వరముద్రతో, కౌమారి అనే కార్తీకేయ శక్తి వేలాయుధంతో మహేంద్ర రూపంలో ఇంద్రుని శక్తితో ఐరావతంలో వజ్రాయుధంతో వరాహిగా, చాముండేశ్వరిగా, నారసింహినిగా ఆయుధాలతో కమల పీఠంలో నవరాత్రి దేవతలు ఉద్భవించింది. ఈ దుర్గాదేవి శంభుడు, నిశంభులను సంహరించింది. దీంతో రాక్షసుల బారి నుంచి తప్పించుకున్న దేవతలు మహిషాసుర మర్దిని అయిన దేవదేవిని స్తుతించారు. అందుకే దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలను వైభవంగా జరుపుకుంటారు.

నవరాత్రులు ఎందుకు జరుపుకోవాలో దేవి భాగవతంలో చెప్పబడింది. జగజ్జనని అయిన ఆ తల్లిని పూజిస్తే ఇహంలో భోగ భాగ్యములను, పరంలో ముక్తినీ ప్రసాదిస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. విజయదశమి రోజున త్రిశక్తి రూపిణి అయిన అమ్మవారు మహిషాసురునితో తొమ్మిది రోజులు భీకర యుద్ధం చేసి విజయదశమి రోజే హతమార్చింది.

రామచంద్రుడు రావణాసురుడిని చంపింది కూడా ఈరోజే. శమీవృక్షంపై ఉన్న అస్త్రాలను అర్జునుడు పూజించి ఉత్తర గోగ్రహణంలో కౌరవులపై గెలిచింది కూడా ఈ రోజే. అందుకే నవరాత్రుల్లో పాడ్యమి నుంచి దశమి వరకు అమ్మవారిని రోజుకో అలంకారంలో చూస్తుంటాం.

నవరాత్రుల్లో భాగంగా ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమిలో నవరాత్రుల కలశ స్థాపన చేయాలి. ఇది తొమ్మిది రోజులు చేసే పూజా కార్యక్రమం. అందుకనే వాటిని దేవీనవరాత్రులు అని పిలువబడుతున్నాయి. పూజా మందిరంలో కలశ స్థాపన చేయుటకు వేదికను తయారు చేసుకోవాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి, నామం ధరించి, పట్టు వస్త్రములు కట్టుకొని, చేతికి పవిత్రం ధరించి పూజకు ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఆసనంపై తూర్పు ముఖంగాని, ఉత్తర ముఖం గాని కూర్చోవాలి.

గురువును స్తుతించి.. గాయత్రీ మంత్రం జపించిన తర్వాత మహాసంకల్పం చెప్పాలి. గృహస్తులైనవారు సతీ సమేతంగా సంకల్పము చేయాలి. విఘ్నేశ్వర పూజ చేయాలి. ఆపై తొమ్మిది రోజుల పాటు బ్రాహ్మణులను గౌరవించాలి. తొమ్మిది రోజుల పూజ అయ్యేవరకూ, అఖండ దీపారాదన రాత్రింబవళ్ళు వెలగాలి. ఇలా తొమ్మిది రోజుల పాటు పూజ చేసేవారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.