
కళ్లు మూసి తెరిచేంతలో దారుణమైన ప్రకృతి బీభత్సం.. కళ్లముందే కొట్టుకుపోయిన వందలాది కుటుంబాలు.. నదిలో తేలుతున్న మృతదేహాలు.. ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలు. కేరళలో అంతులేని విషాదానికి ఇవి ఆనవాళ్లు. దేవభూమిగా పిలిచే గడ్డపై మరణమృదంగం మోగింది. ఏటా భారీ వర్షాలు మామూలే అయినా.. ఇలా కొండచరియలు విరిగిపడి వందలాదిమంది సజీవసమాధి కావడం.. కనీసం చివరి చూపుకైనా నోచుకోలేని పరిస్థితులు ఉండడం.. పగవాడికి కూడా రాకూడని పరిస్థితి ఇది. పశ్చిమకనుమల్లో జలప్రళయానికి అసలు కారణాలేమిటి? అర్థరాత్రి వేళ ఆదమరిచి నిద్రపోతున్న వారి ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ దెబ్బకు ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్లు నేలమట్టమవ్వడం.. వాటి కింద వందలాదిమంది ఇరుక్కుపోవడం.. ఎటూ కదలలేక.. ప్రాణాలు కాపాడుకోలేక మృతి చెందిన సంఘటనలు కన్నీరు పెట్టిస్తాయి. కేరళలో ఆ విలయం అర్థరాత్రితో ఆగలేదు. తెల్లవారుజామున మళ్లీ మరోసారి బీభత్సం సృష్టించింది. దీని దెబ్బకు సహాయశిబిరంతోపాటు అక్కడున్న ఇళ్లు, షాపులు అన్నీ ధ్వంసమయ్యాయి. దేవభూమిలో.. వయనాడ్ జిల్లాలో కొన్ని గ్రామాల్లో టీ, కాఫీ తోటల్లో పనిచేయడానికి అసోంతోపాటు పశ్చిమబెంగాల్ నుంచి వలస కూలీలు వస్తుంటారు. వారిలో 600 మంది ఆచూకీ కూడా కనుక్కోలేని పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. Kerala Wayanad Landslides 1 ఈ...