Kerala Wayanad landslides: కొండచరియలు ఎందుకు విరిగిపడతాయి? వాటిని ముందే పసిగట్టలేమా? హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేయలేమా?

కొండచరియలు విరిగిపడితే.. ఆ ప్రాంతంలో ఉన్న నిర్మాణాలు ధ్వంసమవుతాయి. అక్కడుండేవారు ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది. మనిషి చందమామపై అడుగుపెట్టగలిగేంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి దారుణాలను ముందే ఊహించలేమా? దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోలేమా?

Kerala Wayanad landslides: కొండచరియలు ఎందుకు విరిగిపడతాయి? వాటిని ముందే పసిగట్టలేమా? హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేయలేమా?
Kerala Wayanad Landslides 7

Edited By: Ravi Panangapalli

Updated on: Aug 01, 2024 | 9:32 AM

కళ్లు మూసి తెరిచేంతలో దారుణమైన ప్రకృతి బీభత్సం.. కళ్లముందే కొట్టుకుపోయిన వందలాది కుటుంబాలు.. నదిలో తేలుతున్న మృతదేహాలు.. ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలు. కేరళలో అంతులేని విషాదానికి ఇవి ఆనవాళ్లు. దేవభూమిగా పిలిచే గడ్డపై మరణమృదంగం మోగింది. ఏటా భారీ వర్షాలు మామూలే అయినా.. ఇలా కొండచరియలు విరిగిపడి వందలాదిమంది సజీవసమాధి కావడం.. కనీసం చివరి చూపుకైనా నోచుకోలేని పరిస్థితులు ఉండడం.. పగవాడికి కూడా రాకూడని పరిస్థితి ఇది. పశ్చిమకనుమల్లో జలప్రళయానికి అసలు కారణాలేమిటి? అర్థరాత్రి వేళ ఆదమరిచి నిద్రపోతున్న వారి ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ దెబ్బకు ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్లు నేలమట్టమవ్వడం.. వాటి కింద వందలాదిమంది ఇరుక్కుపోవడం.. ఎటూ కదలలేక.. ప్రాణాలు కాపాడుకోలేక మృతి చెందిన సంఘటనలు కన్నీరు పెట్టిస్తాయి. కేరళలో ఆ విలయం అర్థరాత్రితో ఆగలేదు. తెల్లవారుజామున మళ్లీ మరోసారి బీభత్సం సృష్టించింది. దీని దెబ్బకు సహాయశిబిరంతోపాటు అక్కడున్న ఇళ్లు, షాపులు అన్నీ ధ్వంసమయ్యాయి. దేవభూమిలో.. వయనాడ్ జిల్లాలో కొన్ని గ్రామాల్లో టీ, కాఫీ తోటల్లో పనిచేయడానికి అసోంతోపాటు పశ్చిమబెంగాల్ నుంచి వలస కూలీలు వస్తుంటారు. వారిలో 600 మంది ఆచూకీ కూడా కనుక్కోలేని పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. Kerala Wayanad Landslides 1 ఈ శతాబ్దంలోనే అంతులేని విషాద ఘటన మాత్రం 2018లోనే జరిగింది. ఆ 2018 నాటి ప్రకృతి విలయం తరువాత అంతటి బీభత్సం సృష్టించిన దారుణమైన ఘటన ఏదైనా ఉందీ...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి