1528-2019ల మధ్య అయోధ్యపై వివాదాలు ఇవే..!

దాదాపు 15 శతాబ్దాల.. సుధీర్ఘం కాలంపాటు నుంచి నానున్నతోన్న.. అత్యంత సున్నితమైన కేసు ‘అయోధ్య’ తీర్పు. 2.27 ఎకరాల భూమి తమదంటే.. తమదే అంటూ హిందూ, ముస్లిం వర్గాలు ఎప్పటినుంచో వాదోపవాదనలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో.. మెఘల్ చక్రవర్తి బాబర్ కాలం నుంచి నానున్నతోన్న ఈ వివాదం.. చరిత్రేంటి..? ఎప్పటి నుంచి ఇలా మొదలయ్యింది..? మరి ఆ వివరాలేంటో ఓ సారి చూద్దాం..! 1528: మొఘల్ చక్రవర్తి బాబర్ సేనాని మీర్ బాఖీ.. బాబ్రీ మసీదును నిర్మించారు. […]

1528-2019ల మధ్య అయోధ్యపై వివాదాలు ఇవే..!
Follow us

| Edited By:

Updated on: Nov 09, 2019 | 12:05 PM

దాదాపు 15 శతాబ్దాల.. సుధీర్ఘం కాలంపాటు నుంచి నానున్నతోన్న.. అత్యంత సున్నితమైన కేసు ‘అయోధ్య’ తీర్పు. 2.27 ఎకరాల భూమి తమదంటే.. తమదే అంటూ హిందూ, ముస్లిం వర్గాలు ఎప్పటినుంచో వాదోపవాదనలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో.. మెఘల్ చక్రవర్తి బాబర్ కాలం నుంచి నానున్నతోన్న ఈ వివాదం.. చరిత్రేంటి..? ఎప్పటి నుంచి ఇలా మొదలయ్యింది..? మరి ఆ వివరాలేంటో ఓ సారి చూద్దాం..!

  • 1528: మొఘల్ చక్రవర్తి బాబర్ సేనాని మీర్ బాఖీ.. బాబ్రీ మసీదును నిర్మించారు.
  • 1853: మొదటిసారి అక్కడ మత విద్వేషాలు, గొడవలు జరిగాయి
  • 1859: ఆ ప్రాంతంలో ఫెన్సింగ్ నిర్మించి.. హిందువులు, ముస్లింలకు వేర్వేరుగా అనుమతి కల్పించారు.
  • 1885: రామ జన్మభూమి-బాబ్రీ మసీదు కేసు తొలిసారి కోర్టు మెట్లెక్కింది.
  • 1949: మసీదు వద్ద సీతారాముల విగ్రహాలను పెట్టారు.. దీంతో.. మరోసారి అక్కడ అల్లర్లు నెలకొన్నాయి.
  • 1959: అయోధ్య వివాదాస్పద స్థలంపై తమకే హక్కుందని కోర్టును ఆశ్రయించిన నిర్మోహి అఖాండా సంస్థ
  • 1981: అయోధ్య వివాద స్థలం తమదేనని ముస్లిం వర్గానికి చెందిన సున్నీ వక్ఫ్ బోర్డు తరుపున కోర్టులో వ్యాజ్యం దాఖలు
  • 1984: అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని కొన్ని హిందూ సంఘాలు కమిటీగా ఏర్పడి డిమాండ్ చేశాయి.
  • 1986: ఫిబ్రవరి 1న హిందువులు ప్రార్థన చేసుకోవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది.
  • 1989: బాబ్రీ మసీదు వద్ద రామమందిర నిర్మాణానికి వీహెచ్‌పీ పునాదిరాయి వేసింది
  • 1990: అప్పటి బీజేపీ అధ్యక్షుడు ఎల్‌కే అద్వానీ రామ రథయాత్రను ప్రారంభించారు.
  • 1992: డిసెంబర్ 2న బాబ్రీ మసీదును కూల్చివేసిన కర సేవకులు.
  • 2010: డిసెంబర్ 30న వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని కక్షిదారులు పంచుకోవాలంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది
  • 2011: అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే
  • 2017: ఆగష్టు 7న అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ
  • 2018: జులై 20న అయోధ్య తీర్పును వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం

ఇక 2019 మార్చిలో మధ్య వర్తుల కమిటీని కూడా నియమించింది సుప్రీం. ఆగష్టులో అయోధ్య వివాదంపై ఏర్పాటైన మధ్యవర్తుల కమిటీ కూడా వివాదాన్ని పరిష్కరించలేకపోయింది. మళ్లీ దీనిపై రోజువారీ విచారణను ప్రారంభించింది. అక్టోబర్‌‌లో ఇరు వర్గాల వాదనలు ముగిశాయి. సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్‌‌లో పెట్టింది. నవంబర్ 9కాగా అంటే ఈరోజు సుప్రీం.. అయోధ్య చరిత్రాత్మకమైన తీర్పును వెలువరించబోతోంది.