అమెరికా వాయుసేనలో చేరిన రోబో జాగిలాలు

|

Sep 10, 2020 | 11:17 AM

భవిష్యత్తులో మాన రహిత యుద్ధాలు జరగవచ్చనే అంచనాల నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా రోబో జాగిలాలను విజయవంతంగా పరీక్షించింది. కృత్రిమ మేథ వంటి అత్యాధునిక సాంకేతికతపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది.

అమెరికా వాయుసేనలో చేరిన రోబో జాగిలాలు
Follow us on

భవిష్యత్తులో మాన రహిత యుద్ధాలు జరగవచ్చనే అంచనాల నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా రోబో జాగిలాలను విజయవంతంగా పరీక్షించింది. కృత్రిమ మేథ వంటి అత్యాధునిక సాంకేతికతపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. అమెరికా వాయుసేన ఇటీవల ఈ రోబో జాగిలాలను ప్రయోగించింది. శత్రు దేశాల నుంచి వాయుసేన స్థావరాలను ఎలా రక్షించాలనే వ్యూహంపై ఏర్పాటు చేసిన యుద్ధ విన్యాసాలలో భాగంగా అమెరికా వాయు సేన రోబో జాగిలాలను రంగంలోకి దింపింది. వాటి పనితీరును పరీక్షించింది. యుద్ధ రంగానికి సంబంధించిన అన్ని దృశ్యాలను రోబో జాగిలం రికార్డు చేసి సైనికులకు ఎప్పటికప్పడు డిటెయిల్స్ పంపించగలుగుతుందని యూఎస్ వాయు సేన ఓ ప్రకటనలో తెలిపింది.

విమానాల రక్షణ కోసం ఉన్న సైనికులు తామున్న చోటే జాగిలాలు అందించిన చిత్రాల ద్వారా యుద్ధ క్షేత్రంపై వ్యుహాత్మకంగా వ్యవహరించేందుకు వీలవుతుంది. అమెరికాలోని నెల్లిస్ ఎయిర్ బేస్‌లో రోబో జాగిలాల అధ్యయనం జరిగినట్లు యూఎస్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది. యుద్ధరంగానికి సంబంధించిన అన్ని దృశ్యాలను రోబో జాగిలు సేకరిస్తుందని వాయుసేన ఓ ప్రకటనలో తెలిపింది.