
న్యూఢిల్లీ : దేశ అత్యున్నత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీ కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్- 2018 పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 759 మందిని ఎంపిక చేసినట్టు యూపీఎస్సీ ప్రకటించింది. గతేడాది సెప్టెంబర్ -అక్టోబర్ నెలలో సివిల్స్ పరీక్షలు నిర్వహించారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి- మార్చి నెలల్లో ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి. ఇవాళ తుది ఫలితాలను ప్రకటించారు. ఈ ఫలితాల్లో కనిషక్ కటారియా ప్రథమ స్థానంలో నిలవగా.. అక్షత్ జైన్ రెండో ర్యాంకు, జునైద్ అహ్మద్కు మూడో ర్యాంకుల్లో నిలిచారు. కర్ణాటి వరుణ్రెడ్డి ఏడో ర్యాంకు, అంకితా చౌదరి 14వ ర్యాంకులు సాధించారు.