దారుణం..జన్మనిచ్చిన అమ్మనే సజీవ దహనం చేసిన కొడుకు

|

Nov 02, 2020 | 7:00 PM

ఉత్తర్​ప్రదేశ్​ షాజహాన్​పుర్​లో దారుణం జరిగింది. నిద్రిస్తున్న తల్లిపై కిరోసిన్​ పోసి సజీవ దహనం చేశాడు ఓ శాడిస్ట్ కుమారుడు.

దారుణం..జన్మనిచ్చిన అమ్మనే సజీవ దహనం చేసిన కొడుకు
Follow us on

ఉత్తర్​ప్రదేశ్​ షాజహాన్​పుర్​లో దారుణం జరిగింది. నిద్రిస్తున్న తల్లిపై కిరోసిన్​ పోసి సజీవ దహనం చేశాడు ఓ శాడిస్ట్ కుమారుడు. తీవ్రగాయాలపాలైన ఆమె.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. వివరాల్లోకి వెళ్తే.. కొంతకాలంగా రత్నా దేవి(58), ఆమె తనయుడు ఆకాశ్​ గుప్తా మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఎలాగైనా తల్లిని చంపాలనుకున్న ఆకాశ్..​. భార్య, బంధువులతో కలిసి పక్కా ప్లాన్ వేశాడు. సోమవారం తెల్లవారుజామున రత్నా దేవి నిద్రిస్తున్న సమయంలో ఒంటిపై కిరోసిన్​ పోసి, నిప్పంటించాడు. రత్నా దేవి కేకలు విన్న ఇరుగుపొరుగువారు.. పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. తీవ్ర గాయాలపాలైన రత్నా దేవి.. చికిత్స పొందుతూ మరణించింది. నిందితులు ఆకాశ్​ గుప్తా సహా.. అతడి బంధువులు అచెలాల్​, వినోద్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read :

సౌండ్ పెంచితే సీజ్!

క్రికెట్‌కు షేన్ వాట్సన్‌ గుడ్ ‌బై !