పాత బావి పూడుస్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి

|

Sep 18, 2020 | 3:21 PM

కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు కూలీలు ప్రమాదవశాత్తు బావిలో పడి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన నూజివీడు మండలంలో చోటుచేసుకుంది. పాత బావి పూడ్చే పనిలో భాగంగా పనులు చేస్తుండగా జారిపడి ఇద్దరు కూలీలు మృతి చెందారు.

పాత బావి పూడుస్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి
Follow us on

కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు కూలీలు ప్రమాదవశాత్తు బావిలో పడి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన నూజివీడు మండలంలో చోటుచేసుకుంది. పాత బావి పూడ్చే పనిలో భాగంగా పనులు చేస్తుండగా జారిపడి ఇద్దరు కూలీలు మృతి చెందారు. నూజివీడు మండలం పోనసనపల్లి గ్రామానికి చెందిన 8 మంది కూలీలు మల్లవల్లి గ్రామానికి బావి పూడ్చేందుకు వచ్చారు. పాత బావి పూడ్చే క్రమంలో ప్రమాదవశాత్తు నలుగురు వ్యక్తులు బావిలో పడిపోయారు. దీంతో అప్రమత్తమైన మగతా కూలీలు ఇద్దరిని అతి కష్టం మీద బయటకు తీసుకువచ్చారు. కాగా, వారిలో ఇద్దరు మృతి చెందారు. మృతి చెందినవారు అచ్చి తిరుపతయ్య(60), అచ్చి రమేష్ (40)గా గుర్తించారు. పాత బావిలో మట్టిలో పూడుకుపోయిన మృతదేహాల కోసం జేసీబీతో అధికారులు వెదుకుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీసే పనిలో పడ్డారు.