కాల్పులతో మార్మోగిన దండకారణ్యం

| Edited By: Pardhasaradhi Peri

Jun 28, 2019 | 8:06 PM

దండకారణ్యం మరోసారి కాల్పులతో మార్మోగింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు అమరులవ్వగా.. మరో జవాన్‌కు తీవ్రగాయాలయ్యాయి. అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు సామాన్యులకు కూడా గాయాలైనట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని వెల్లడించారు. ఘటనాస్థలి నుంచి మావోయిస్టులు పారిపోయినారని.. అక్కడ భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి లభ్యమైనట్లు అధికారులు చెప్పారు.

కాల్పులతో మార్మోగిన దండకారణ్యం
Follow us on

దండకారణ్యం మరోసారి కాల్పులతో మార్మోగింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు అమరులవ్వగా.. మరో జవాన్‌కు తీవ్రగాయాలయ్యాయి. అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు సామాన్యులకు కూడా గాయాలైనట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని వెల్లడించారు. ఘటనాస్థలి నుంచి మావోయిస్టులు పారిపోయినారని.. అక్కడ భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి లభ్యమైనట్లు అధికారులు చెప్పారు.