ఈనెల 28న టీటీడీ బోర్డు సమావేశం ఈ కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌

ఈనెల 28న టీటీడీ బోర్డు సమావేశం స‌మావేశం కానుంది. బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించి కీల‌క విష‌యాల‌పై చ‌ర్చించ‌నుంది.

ఈనెల 28న టీటీడీ బోర్డు సమావేశం ఈ కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌
T
Follow us

|

Updated on: Aug 24, 2020 | 12:31 PM

ఈనెల 28న టీటీడీ బోర్డు సమావేశం స‌మావేశం కానుంది. బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించి కీల‌క విష‌యాల‌పై చ‌ర్చించ‌నుంది. సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జ‌ర‌గ‌నున్నాయి. అయితే బ్ర‌హ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించాలా, యథావిధిగా నిర్వహించాలా అన్న అంశంపై బోర్డు స‌భ్యులు చ‌ర్చించ‌నున్నారు. ప్రస్తుతం కోవిడ్ నిబంధనల ప్రకారం ఉత్సవాల ఊరేగింపుకు అనుమతి లేకపోవడంతో కేంద్ర మార్గదర్శకాల కోసం టీటీడీ ఎదురు చూస్తుంది. బ్రహ్మోత్సవ రోజుల్లో రూ.300 టికెట్లను రద్దు చేశారు. లాక్ డౌన్ నిబంధనల నుంచి ఊరేగింపులకు సడలింపు రాకపోతే బ్రహ్మోత్సవాలను ఆలయంలో ఏకాంతంగానే నిర్వహిస్తామ‌ని టీటీడీ అధికారులు చెబుతున్నారు.

Also Read :

ఏపీ : ఆ 4 జిల్లాల్లో లక్షణాలు లేకపోయినా‌ కరోనా పాజిటివ్‌

వైఎస్సార్‌ ఆసరా‌ నగదుపై ఆంక్షలు లేవు, ఉత్త‌ర్వుల్లో తేల్చి చెప్పిన స‌ర్కార్

నందిగామ కెడీసీసీ బ్యాంకులో భారీ కుంభ‌కోణం