టీఆర్ఎస్ ఎంపీ రాములుకి కరోనా పాజిటివ్

|

Oct 23, 2020 | 6:54 PM

టీఆర్ఎస్ ఎంపీ పి.రాములు కరోనా బారిన పడ్డారు. కొవిడ్ లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందని స్వయంగా రాములు వెల్లడించారు. కరోనా నిర్ధారణ కావడంతో హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో ఆయన చేరారు. తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన వారంతా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని రాములు కోరారు. కాగా, సామాన్యులతో పాటు ప్రముఖులు సైతం మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. డిప్యూటీ సీఎం, డిప్యూటీ […]

టీఆర్ఎస్ ఎంపీ రాములుకి కరోనా పాజిటివ్
Follow us on

టీఆర్ఎస్ ఎంపీ పి.రాములు కరోనా బారిన పడ్డారు. కొవిడ్ లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందని స్వయంగా రాములు వెల్లడించారు. కరోనా నిర్ధారణ కావడంతో హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో ఆయన చేరారు. తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన వారంతా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని రాములు కోరారు. కాగా, సామాన్యులతో పాటు ప్రముఖులు సైతం మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్, హైదరాబాద్ మేయర్, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీరిలో ఉన్నారు. మంత్రి హరీశ్ రావు కూడా కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.