AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీఆర్ఎస్ నేతను హతమార్చిన మావోలు.. మిగతావారికి వార్నింగ్

తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో టీఆర్ఎస్ నాయకున్ని మావోయిస్టులు పొట్టనబెట్టుకున్నారు. వెంకటాపురం మండలం అలుబాక గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు మాడురి బిమేశ్వర్ రావును అర్థరాత్రి మావోయిస్టులు చంపేశారు. ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిని లేపి మరీ కత్తితో విచక్షణారహితంగా పొడిచిన మావోయిస్టులు.. సంఘటనా స్థలంలో లేఖ వదిలిపెట్టిపోయారు. ఈ ఆపరేషన్ లో ఆరుగురు మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం. అధికార పార్టీలో కొనసాగుతూ అమాయక ప్రజలను దోచుకుంటున్నాడని లేఖలో పేర్కొన్న మావోయిస్టులు.. టీఆర్ఎస్ – బీజేపీ నాయకులు వెంటనే […]

టీఆర్ఎస్ నేతను హతమార్చిన మావోలు.. మిగతావారికి వార్నింగ్
Venkata Narayana
|

Updated on: Oct 11, 2020 | 6:58 AM

Share

తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో టీఆర్ఎస్ నాయకున్ని మావోయిస్టులు పొట్టనబెట్టుకున్నారు. వెంకటాపురం మండలం అలుబాక గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు మాడురి బిమేశ్వర్ రావును అర్థరాత్రి మావోయిస్టులు చంపేశారు. ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిని లేపి మరీ కత్తితో విచక్షణారహితంగా పొడిచిన మావోయిస్టులు.. సంఘటనా స్థలంలో లేఖ వదిలిపెట్టిపోయారు. ఈ ఆపరేషన్ లో ఆరుగురు మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం. అధికార పార్టీలో కొనసాగుతూ అమాయక ప్రజలను దోచుకుంటున్నాడని లేఖలో పేర్కొన్న మావోయిస్టులు.. టీఆర్ఎస్ – బీజేపీ నాయకులు వెంటనే వారి పదవులకు రాజీనామాలు చేయాలని, లేకపోతే వారికి కూడా ఇదే గతి పట్టుద్దని హెచ్చరికలు జారీ చేశారు.