తుపాకీతో కాల్చుకుని పుట్టినరోజే మూడేళ్ల బాలుడు బలి

అమెరికాలో విషాదకర సంఘటన ఒకటి చోటుచేసుకుంది. హూస్టన్ నగరానికి సమీపంలో అభంశుభం తెలియని మూడేళ్ల బాలుడు తన పుట్టిన రోజు నాడే తుపాకీతో తనను తానే కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు.

తుపాకీతో కాల్చుకుని పుట్టినరోజే మూడేళ్ల బాలుడు బలి
Follow us

|

Updated on: Oct 27, 2020 | 4:00 PM

అమెరికాలో విషాదకర సంఘటన ఒకటి చోటుచేసుకుంది. హూస్టన్ నగరానికి సమీపంలో అభంశుభం తెలియని మూడేళ్ల బాలుడు తన పుట్టిన రోజు నాడే తుపాకీతో తనను తానే కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికా దేశంలోని హూస్టన్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలోని పోర్టర్ పట్టణంలో జరిగింది. పోర్టర్ పట్టణంలో టెక్సాస్ నగరానికి చెందిన మూడేళ్ల బాలుడి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. పిల్లలు ఆడుకుంటుండగా, పెద్దలు పేకాట ఆడుతూ లీనమయ్యారు. అంతలో తుపాకీ పేలిన శబ్ధం విన్న పెద్దలు బాలుడి వద్దకు పరుగెత్తుకెళ్లి చూడగా.. ఛాతీలో నుంచి బుల్లెట్ దూసుకుపోయి రక్తమడుగులో బాలుడు పడి ఉన్నాడు. ఈ హఠాత్తు పరిణామంతో షాక్ గురైన తల్లదండ్రులు ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు.

వెంటనే బాలుడ్ని సమీపంలోని అగ్నిమాపక కేంద్రానికి తరలించగా అప్పటికే మరణించాడని మోంట్గో మేరి కౌంటీ షెరీఫ్ అధికారులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పుట్టిన రోజు వేడుక పురస్కరించుకుని ఇంటికి వచ్చిన బంధువుల జేబులో నుంచి పడిపోయిన పిస్టల్ ను బాలుడు తీసుకొని కాల్చుకున్నట్లు అధికారులు చెప్పారు. అమెరికాలో ఇలా పిస్టళ్లతో కాల్చుకోవడం వల్ల 97 మంది పిల్లలు మరణించారని గ్రూప్ ఎవ్రీటౌన్ ఫర్ గన్ సేఫ్టీ అధికారి ఒకరు చెప్పారు. అమెరికాలో తుపాకుల సంస్కృతి అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఇప్పటివరకు అమెరికాలో మూడవ వంతు మందికి తుపాకులున్నాయి. అందులోనూ టెక్సాస్ నగరంలో అత్యధికంగా తుపాకులున్న రాష్ట్రాల్లో ఒకటి. బాలుడి జన్మదినోత్సవం రోజే బుల్లెటుకు బలికావడంతో ఆ ఇంట్లో విషాదం అలముకుంది.