AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘వీ స్టాండ్ విత్ ఫార్మర్స్’, భారతీయ రైతుల ఆందోళనకు మద్దతు, లండన్ లో వేలాది మంది ర్యాలీ, అరెస్ట్

ఇండియాలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా లండన్ లో ఆదివారం వేలాది మంది భారీ ర్యాలీ నిర్వహించారు. కోవిడ్ 19 నిబంధనలను అతిక్రమించారంటూ అనేకమందిని పోలీసులు అరెస్టు చేశారు.

'వీ స్టాండ్ విత్ ఫార్మర్స్', భారతీయ రైతుల ఆందోళనకు మద్దతు, లండన్ లో వేలాది మంది ర్యాలీ, అరెస్ట్
Umakanth Rao
| Edited By: |

Updated on: Dec 07, 2020 | 10:51 AM

Share

ఇండియాలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా లండన్ లో ఆదివారం వేలాది మంది భారీ ర్యాలీ నిర్వహించారు. కోవిడ్ 19 నిబంధనలను అతిక్రమించారంటూ అనేకమందిని పోలీసులు అరెస్టు చేశారు. వీ స్టాండ్ విత్ ఫార్మర్స్, జస్టిస్ ఫర్ ఫార్మర్స్, ఇండియా స్టాప్ సెల్లింగ్ ఆఫ్ యువర్ ఫార్మర్స్ అని రకరకాల నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులను చేతబట్టుకుని వీరంతా అక్కడి భారత్ ఎంబసీ వద్ద ప్రొటెస్ట్ చేశారు. వీరిలో సిక్కులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కొందరు ప్రధాని మోదీ పోస్టర్ తో ప్రదర్శనలో పాల్గొన్నారు. అయితే భారత రైతుల ఆందోళన ఆ దేశ అంతర్గత ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమని, కొంతమంది  వ్యతిరేక వేర్పాటువాదులు భారత  రైతుల ఆందోళనను సాకుగా తీసుకుని ఈ ప్రదర్శనకు దిగారని ఇండియన్ హైకమిషన్ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. అసలు అనుమతి లేకుండా ఇంతమంది ఎలా నిరసనకు పూనుకొన్నారని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.భారత ప్రభుత్వం ఇంకా రైతులతో చర్చలు జరుపుతున్న విషయాన్ని మరువరాదని ఆయన చెప్పారు. ఇటీవల బ్రిటిష్ సిక్కు ఎంపీ తన్ మన్ జిత్ సింగ్ ధేశీ ఆధ్వర్యాన 36 మంది ఎంపీలు కూడా భారత రైతుల ప్రొటెస్ట్ పై స్పందించారు. రైతుల ఆందోళనపై ఇండియా విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తో చర్చించవలసిందిగా కోరుతూ వీరు తమ దేశ విదేశ వ్యవహారాల మంత్రి డొమినిక్ రాబ్ కు లేఖ రాశారు.