నేటి నుంచి మెడికల్‌ సీట్లకు దరఖాస్తుల స్వీకరణ

| Edited By: Pardhasaradhi Peri

Jul 03, 2019 | 10:31 AM

తెలంగాణలోని ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటాలో సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్‌‌లో అర్హత సాధించిన అభ్యర్థులు కేటగిరీ బీ, సీ (ఎన్‌ఆర్‌ఐ) కోటాలో సీట్లకు జూలై 3న ఉదయం 9 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ఈనెల 11న తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. ఈ ప్రక్రియ […]

నేటి నుంచి మెడికల్‌ సీట్లకు దరఖాస్తుల స్వీకరణ
Follow us on

తెలంగాణలోని ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటాలో సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్‌‌లో అర్హత సాధించిన అభ్యర్థులు కేటగిరీ బీ, సీ (ఎన్‌ఆర్‌ఐ) కోటాలో సీట్లకు జూలై 3న ఉదయం 9 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ఈనెల 11న తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. ఈ ప్రక్రియ హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని ప్రొఫెసర్‌ రాంరెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌‌లో నిర్వహిస్తారు. ఇందుకు తేదీలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది.

ఇదిలావుంటే 10 ప్రైవేటు మెడికల్ కాలేజీలు అగ్రవర్ణ పేదలకు (ఈడబ్ల్యూఎస్‌) కోటా కింద సీట్లు పెంచాలని మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకి దరఖాస్తు చేశాయి. కానీ ఇప్పటివరకు సీట్ల పెంపుపై ఎంసీఐ స్పష్టత ఇవ్వలేదు. ప్రైవేటులోని కన్వీనర్‌ కోటా సీట్లకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. వాటికి ఇప్పటికే సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. కానీ అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఆయా వర్గాల విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.