తెలంగాణలో కొత్తగా 269 కరోనా కేసులు…

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ కొత్తగా 269 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 5,675కి చేరింది. ఇందులో 2,412 యాక్టివ్ కేసులు ఉండగా.. 3,071 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు 192 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఇవాళ కరోనాతో ఒక్కరు మరణించగా.. 151 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా […]

తెలంగాణలో కొత్తగా 269 కరోనా కేసులు...

Updated on: Jun 17, 2020 | 9:35 PM

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ కొత్తగా 269 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 5,675కి చేరింది. ఇందులో 2,412 యాక్టివ్ కేసులు ఉండగా.. 3,071 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు 192 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

మరోవైపు ఇవాళ కరోనాతో ఒక్కరు మరణించగా.. 151 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క గ్రేటర్ పరిధిలోనే 214 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక జనగాంలో 5, జయశంకర్ భూపాలపల్లిలో 1, కరీంనగర్ లో 8, ఆసిఫాబాద్ లో 1, మహబూబ్ నగర్ 1, మెదక్ 3, మేడ్చల్  2, ములుగు 5, రంగారెడ్డి 13, సంగారెడ్డి 3, వికారాబాద్ 1, వనపర్తి 2, వరంగల్ అర్బన్ లో 10 కేసులు నమోదయ్యాయి. అటు ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 45,911 మందికి కరోనా టెస్టులు చేయగా.. అందులో 40,236 మందికి కరోనా నెగటివ్ గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజాగా బులిటెన్ లో పేర్కొంది.