నీతి ఆయోగ్‌ సమావేశానికి కేసీఆర్

| Edited By: Pardhasaradhi Peri

Jun 12, 2019 | 2:43 PM

శుక్రవారం తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. 15వ తేదీన నిర్వహించే నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ హాజరవుతారు. ఆ తర్వాత ప్రధాని సహా కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు సహా నిధులు కూడా విడుదల చేయాలని కోరే అవకాశమున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో పాల్గొనవలసిందిగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఈ మీటింగ్‌లో వాన నీటి సంరక్షణ, దేశంలోని కరవు […]

నీతి ఆయోగ్‌ సమావేశానికి కేసీఆర్
Follow us on

శుక్రవారం తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. 15వ తేదీన నిర్వహించే నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ హాజరవుతారు. ఆ తర్వాత ప్రధాని సహా కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు సహా నిధులు కూడా విడుదల చేయాలని కోరే అవకాశమున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో పాల్గొనవలసిందిగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఈ మీటింగ్‌లో వాన నీటి సంరక్షణ, దేశంలోని కరవు పరిస్థితులు, ఉపశమన చర్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.