వైసీపీ నేతల నుంచి రంగుల ఖర్చు వసూలు చేయాలి: బాబు

|

Jun 03, 2020 | 4:22 PM

ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల ఉదంతంపై ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు స్పందించారు. రంగుల ఖర్చును వైసీపీ నేతల నుండే రాబట్టాలని డిమాండ్.

వైసీపీ నేతల నుంచి రంగుల ఖర్చు వసూలు చేయాలి: బాబు
Follow us on

ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల ఉదంతంపై ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు స్పందించారు. ప్రభుత్వ ఆస్తులకు రంగులు వేయడాన్ని కోర్టు మొట్టికాయలు వేయడం సిగ్గుచేటు అన్న బాబు.. రంగుల ఖర్చును వైసీపీ నేతల నుండే రాబట్టాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం పట్ల, కోర్టులంటే వైసీపీ పాలకులకు ఏ మాత్రం గౌరవం లేదన్న బాబు.. కొట్టేస్తారని తెలిసి కూడా కొత్త జీవోలు జారీ చేస్తున్నారన్నారు. హైకోర్టు , సుప్రీంకోర్టు రెండు చోట్ల కోర్టు ధిక్కరణ ఎదుర్కొనే పరిస్థితి తెచ్చుకుంటారని ప్రశ్నించారు.