లోకేష్ పై ఎన్ఆర్ఐ అసభ్యకర పోస్టులు.. పోలీసులకు ఫిర్యాదు

| Edited By: Srinu

Jul 06, 2019 | 7:03 PM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారు. ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి లోకేష్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టాడు. దీనిపై స్పందిస్తూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోకేష్ వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే విధంగా ఈ పోస్టింగ్ ఉందని అందులో తెలిపారు. వెంటనే అతని పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈనెల 3వ తేదీన […]

లోకేష్ పై ఎన్ఆర్ఐ అసభ్యకర పోస్టులు.. పోలీసులకు ఫిర్యాదు
Follow us on

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారు. ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి లోకేష్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టాడు. దీనిపై స్పందిస్తూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోకేష్ వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే విధంగా ఈ పోస్టింగ్ ఉందని అందులో తెలిపారు. వెంటనే అతని పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈనెల 3వ తేదీన ఈ పోస్టును గమనించి.. ప్రభాకర్ రెడ్డి గురించి ఆరా తీయగా, అతడు అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటున్నాడని తెలిసింది. ప్రభాకర్ రెడ్డి ప్రవాస భారతీయుడని, వైసీపీ సానుభూతి పరుడని తెలిసింది. ఈ మేరకు ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. నిందితుడి వ్యాఖ్యలతో కూడిన సీడీలను వర్ల పోలీసులకు అందజేశారు.