జైలు నుంచి నేరుగా.. చికిత్స కోసం హైదరాబాద్

|

Aug 20, 2020 | 10:27 PM

అనంతపురం జిల్లా టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కడప సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. గురువారం సాయంత్రం ఆయన జైలు నుంచి నేరుగా హైదరాబాద్ బయల్దేరారు. ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ...

జైలు నుంచి నేరుగా.. చికిత్స కోసం హైదరాబాద్
JC Prabhakar Reddy
Follow us on

అనంతపురం జిల్లా టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కడప సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. గురువారం సాయంత్రం ఆయన జైలు నుంచి నేరుగా హైదరాబాద్ బయల్దేరారు. ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో పీపీఈ కిట్ ధరించి జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయన్ను తీసుకెళ్తున్న కారు డ్రైవర్ సైతం పీపీఈ కిట్ ధరించి కనిపించారు. చికిత్స కోసం ఆయన హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.

బీఎస్ 3 వాహనాల కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి, కుమారుడు అస్మిత్ రెడ్డి అరెస్టైన విషయం తెలసిందే. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కడప సెంట్రల్ జైలు నుంచి విడుదలైన అనుచరులతో కలిసి భారీ ర్యాలీతో తాడిపత్రి వెళ్లారు. ఈ ర్యాలీ సందర్భంలో స్థానిక సీఐ పట్ల దురుసుగా ప్రవర్తించారని జేసీ ప్రభాకర్ రెడ్డిపై విడుదలైన మరుసటి రోజే కేసు నమోదైంది.. మళ్లీ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.. కోర్టు రిమాండ్ విధించడంతో మళ్లీ కడప సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది. అయితే జైల్లో ఆయనకు కరోనా పాజిటివ్ తేలింది. అదే సమయంలో బెయిల్ కోసం ప్రయత్నించారు ఆయన ఆరోగ్య పరిస్థితిని గమనించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది.