డిగ్రీ, పీజీ ఫైనల్ పరీక్షలపై నేడే తుది తీర్పు

డిగ్రీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై యూజీసీ జారీ చేసిన మార్గదర్శకాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు శుక్రవారం (ఆగస్ట్ 28)న తీర్పు వెలువరించనుంది. అత్యున్నత ధర్మాసనం తీర్పు పరీక్షల నిర్వహణకు కీలకం కానుంది. సెప్టెంబర్ 30లోపు ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలని యూజీసీ (UGC) దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలకు ఇప్పటికే స్పష్టం చేసింది. పలు యూనివర్సిటీలు ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ప్రకటించాయి. అయితే.. మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాలు […]

డిగ్రీ, పీజీ ఫైనల్ పరీక్షలపై నేడే తుది తీర్పు
Follow us

|

Updated on: Aug 28, 2020 | 1:04 AM

డిగ్రీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై యూజీసీ జారీ చేసిన మార్గదర్శకాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు శుక్రవారం (ఆగస్ట్ 28)న తీర్పు వెలువరించనుంది. అత్యున్నత ధర్మాసనం తీర్పు పరీక్షల నిర్వహణకు కీలకం కానుంది. సెప్టెంబర్ 30లోపు ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలని యూజీసీ (UGC) దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలకు ఇప్పటికే స్పష్టం చేసింది. పలు యూనివర్సిటీలు ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ప్రకటించాయి. అయితే.. మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాలు పరీక్షల నిర్వహణకు సుముఖంగా లేవు.

కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ఈ తరుణంలో పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లోకి నెట్టలేమని కొన్ని రాష్ట్రాలు తేల్చి చెబుతున్నాయి. యూజీ, పీజీ పరీక్షలు మాత్రమే కాదు నీట్, జేఈఈ పరీక్షలను కూడా వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. నీట్, జేఈఈ పరీక్షలు నిర్వహించాలని సుప్రీం కోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. డిగ్రీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలపై రేపు తీర్పును వెల్లడించనుంది.