AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని.. ఈసీపై సుప్రీం ఆగ్రహం..

కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎలక్షన్ కోడ్ ‌ఉల్లంఘించిన నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఈసీని ప్రశ్నించింది. మాయావతి, యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారంలో మతపరమైన వ్యాఖ్యలు చేశారంటూ సుప్రీంలో పిటిషన్ దాఖలు అయ్యింది. దీనిపై..  నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఈసీకి సుప్రీం సూటి ప్రశ్న సంధించింది. ఈసీ పూర్తిగా అధికారాలను వినియోగించుకోకపోవడంపై సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది. పూర్తి అధికార పరిమితులు మీకు తెలుసా అని ఈసీని ప్రశ్నించిన […]

నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని.. ఈసీపై సుప్రీం ఆగ్రహం..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 15, 2019 | 1:08 PM

Share

కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎలక్షన్ కోడ్ ‌ఉల్లంఘించిన నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఈసీని ప్రశ్నించింది. మాయావతి, యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారంలో మతపరమైన వ్యాఖ్యలు చేశారంటూ సుప్రీంలో పిటిషన్ దాఖలు అయ్యింది. దీనిపై..  నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఈసీకి సుప్రీం సూటి ప్రశ్న సంధించింది. ఈసీ పూర్తిగా అధికారాలను వినియోగించుకోకపోవడంపై సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది. పూర్తి అధికార పరిమితులు మీకు తెలుసా అని ఈసీని ప్రశ్నించిన సుప్రీం. దీనిపై వివరణ కోరుతూ.. మంగళవారం కోర్టుకు హాజరవ్వాలని సీఈసీకి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.