BREAKING NEWS : సీబీఐకి సుశాంత్ మృతి కేసు.. సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

|

Aug 19, 2020 | 11:49 AM

బాలీవుడ్‌ను కుదిపేస్తున్న యువ హీరో సుశాంత్ సింగ్ మృతి కేసులో కీలక నిర్ణయం వెలువడింది. సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసును సీబీఐకి అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది...

BREAKING NEWS : సీబీఐకి సుశాంత్ మృతి కేసు.. సుప్రీం కోర్టు కీలక నిర్ణయం
Follow us on

SC orders CBI probe in Sushant death case : బాలీవుడ్‌ను కుదిపేస్తున్న యువ హీరో సుశాంత్ సింగ్ మృతి కేసులో కీలక నిర్ణయం వెలువడింది. సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. సేకరించిన అన్ని ఆధారాలను సీబీఐకి అప్పగించాలని మహారాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈనేపథ్యంలో సుశాంత్‌ ఆత్మహత్య కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తూ సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అవసరమనుకుంటే కొత్తగా కేసు ఫైల్‌ చేసేందుకు సీబీఐకి అవకాశం కల్పించింది.

బీహార్‌లో ఇప్పటికే సుశాంత్‌ మృతిపై FIR నమోదైంది. ఆ కేసులో బీహార్‌ పోలీసుల విచారణకు మహారాష్ట్ర పోలీసులు సహకరించాలని సూచించింది. ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలను ముంబై పోలీసులు, సీబీఐకి ఇవ్వాలని ఆదేశించింది.