AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నోరు పారేసుకున్న కర్ణాటక కాంగ్రెస్ నేత

కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఢీలా పడుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరు పార్టీ మీద విరుచుకుపడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రోషన్ బేగ్ తన పార్టీ నేతలనే దుయ్యబడుతూ మీడియాకెక్కారు. కేసీ వేణుగోపాల్‌ను బఫూన్ అని.. సిద్ధా రామయ్యను అహంకారి అని.. దినేష్ గుండు రావును ఫ్లాప్ షో అని అభివర్ణించారు. అంతటితో ఆగకుండా కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే పరిస్థితులతో […]

నోరు పారేసుకున్న కర్ణాటక కాంగ్రెస్ నేత
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 21, 2019 | 7:27 PM

Share

కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఢీలా పడుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరు పార్టీ మీద విరుచుకుపడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రోషన్ బేగ్ తన పార్టీ నేతలనే దుయ్యబడుతూ మీడియాకెక్కారు. కేసీ వేణుగోపాల్‌ను బఫూన్ అని.. సిద్ధా రామయ్యను అహంకారి అని.. దినేష్ గుండు రావును ఫ్లాప్ షో అని అభివర్ణించారు. అంతటితో ఆగకుండా కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే పరిస్థితులతో రాజీపడాలని ముస్లింలకు విఙ్ఞప్తి చేశారు. ఈ వ్యాఖ్యలకు గానూ కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసి.. సంజాయిషీ ఇవ్వాల్సిందిగా కోరింది. కాగా గతేడాది ఆర్జేడీ సహాయంతో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమయంలో రోషన్ బేగ్ ఉప ముఖ్యమంత్రి పదవిని ఆశించారు. అయితే ఆ పదవిని ఆ తరువాత పరమేశ్వరకు ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి పార్టీపై గుర్రుగా ఉన్నారు రోషన్ బేగ్.