పూరీ బీచ్‌లో.. సైక‌త‌ రామ‌మందిరం..!

| Edited By:

Aug 05, 2020 | 2:53 PM

అయోధ్యలో పండుగ వాతావరణం నెలకొంది. స్థానికులు ఇంటిముందు రంగవల్లులతో అలంకరణలు చేశారు. రామ భక్తులు, అఖాడాల సాధువులు రాముడి పాటలతో తన్మయత్వంతో మునిగితేలుతున్నారు. రామ‌న‌గ‌రం అయోధ్య

పూరీ బీచ్‌లో.. సైక‌త‌ రామ‌మందిరం..!
Follow us on

అయోధ్యలో పండుగ వాతావరణం నెలకొంది. స్థానికులు ఇంటిముందు రంగవల్లులతో అలంకరణలు చేశారు. రామ భక్తులు, అఖాడాల సాధువులు రాముడి పాటలతో తన్మయత్వంతో మునిగితేలుతున్నారు. రామ‌న‌గ‌రం అయోధ్య అత్యంత సుంద‌రంగా ముస్తాబైంది. దీపాల వెలుగుల‌తో దేదీప్య‌మానంగా వెలుగుతోంది. ఇక స‌ర‌యూ న‌ది తీరం కూడా ఆక‌ర్ష‌ణీయంగా త‌యారైంది. పువ్వులు, ఆర్ట్ వ‌ర్క్‌ల‌తో తీరం అంతా సుంద‌ర ప్ర‌దేశంగా క‌నువిందు చేస్తోంది. రాముడి చ‌రిత్ర‌కు సంబంధించిన పెయింటింగ్స్ కూడా ఆక‌ట్టుకుంటున్నాయి.

ఒకేసారి 10 వేల మంది భక్తులు రామయ్యను దర్శించుకునేలా, ఆలయ ప్రాంగణంలో దాదాపు లక్ష మంది భక్తులు ప్రార్థనలు చేసుకునేలా రూపకల్పన చేయనున్నారు. ఇక పూరీ బీచ్‌లోని సైక‌త శిల్పి సుద‌ర్శ‌న్ ప‌ట్నాయ‌క్ కూడా త‌న క‌ళాత్మ‌క ప్ర‌ద‌ర్శించారు. అయోధ్య‌లో నిర్మించ‌నున్న రామాల‌యానికి చెందిన డిజైన్‌ను పూరీ బీచ్‌లో సైక‌త శిల్పం రూపంలో వేశారు. జైశ్రీరామ్ అన్న నినాదాంతో అద్భుత‌మైన రంగుల్లో ఆల‌య డిజైన్ చేశారు.

Read More:

మూడవ అతిపెద్ద హిందూ ఆలయంగా.. అయోధ్య..!

గుడ్ న్యూస్: 1167 బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్