“రేపే నీట్” నీట్‌ పరీక్షకు ‘నీట్‌’గా రావాలి

|

Sep 12, 2020 | 4:54 PM

దేశవ్యాప్తంగా రేపు (ఆదివారం) నీట్ ఎగ్జామ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 15 లక్షల మంది ఈ పరీక్షకు హాజరుకానున్నారు. కరోనా నేపథ్యంలో పరీక్షల నిర్వహణలో అనేక జాగ్రత్తలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) తీసుకుంటోంది.

రేపే నీట్ నీట్‌ పరీక్షకు నీట్‌గా రావాలి
Follow us on

దేశవ్యాప్తంగా రేపు (ఆదివారం) నీట్ ఎగ్జామ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 15 లక్షల మంది ఈ పరీక్షకు హాజరుకానున్నారు. కరోనా నేపథ్యంలో పరీక్షల నిర్వహణలో అనేక జాగ్రత్తలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) తీసుకుంటోంది. ఎగ్జామ్స్‌ రాసే విద్యార్థులు తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమ నిబంధనలను వివరించింది.

పరీక్ష రాసే ప్రతి విద్యార్థి..హెల్త్‌ స్టేటస్, ట్రావెల్‌ హిస్టరీతో..సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫామ్ తీసుకురావాల్సి ఉంటుంది. ఏ4 సైజ్‌ పేపర్‌ ప్రింట్‌ సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫామ్‌ తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్‌ ఫామ్‌లో అప్‌లోడ్‌ చేసిన ఫొటో, ఐడీ ప్రూఫ్ తప్పనిసరి అని తెలిపింది. 50ML హ్యాండ్‌ శానిటైజర్‌, ట్రాన్స్‌పరెంట్‌ వాటర్‌ బాటిల్‌, మాస్క్‌, గ్లోవ్స్‌ తీసుకెళ్లాలి. ఇక హ్యాండ్‌ బ్యాగ్స్‌, జ్యువెలరీ, హ్యాట్‌, స్మార్ట్‌ఫోన్‌, స్మార్ట్‌ వాచ్‌లతో పాటు ఇతర వ్యక్తిగత వస్తువులేవీ తీసుకెళ్లకూడదు. ఇక గంటన్నర ముందే ఎగ్జామ్‌ సెంటర్‌కు చేరుకోవాలని అధికారులు సూచించారు.

ఇక డ్రెస్‌కోడ్‌లో కూడా స్వల్ప మార్పులు చేసింది ఎన్టీఏ. విద్యార్థులు తక్కువ హీల్‌ ఉండే స్లిప్పర్స్‌, శాండిల్స్‌ వేసుకోవచ్చు. పాదాలు కప్పేసేలా ఉండే ఫుట్‌వేర్‌, షూస్‌ లాంటివి వేసుకోకూడదు. సంప్రదాయ దుస్తులు..అంటే బురఖా లాంటివి ధరించేవారు ముందుగానే పరీక్ష కేంద్రానికి రావాలి. వారిని నిబంధనల ప్రకారం తనిఖీ చేశాకే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. లైట్‌ హాఫ్‌ స్లీవ్స్‌ డ్రస్సెస్‌ ధరించి రావాలి. లాంగ్‌ స్లీవ్స్‌,పెద్ద పెద్ద బటన్స్‌ ఉండే డ్రస్సులు వేసుకోకూడదు.

మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. అన్ని కేంద్రాల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించాకే విద్యార్థులు, సిబ్బందిని అనుమతిస్తారు. పరీక్ష హాల్లో ప్రతి విద్యార్థీ ఆరడుగుల భౌతిక దూరం పాటించాలి. మాస్కులు, గ్లౌజులు ధరించాలి. తరచూ చేతుల్ని శానిటైజ్‌ చేసుకోవాలి.

ఒకవేళ ఆరోగ్య సమస్యలు తలెత్తితే వారిని సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి పంపి, ఇతర మార్గాల ద్వారా పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు. పరీక్షకు వెళ్లేవారు తప్పనిసరిగా ఈ విషయాలను గుర్తుంచుకోవాలని NTA సూచించింది .

ఇక తెలంగాణలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎగ్జామ్‌ సెంటర్స్‌ను పెంచారు అధికారులు. హైదరాబాద్‌, రంగారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్ జిల్లా కేంద్రాల్లో నీట్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గతేడాది 70 పరీక్షా కేంద్రాలుండగా..ఈ ఏడాది 112 సెంటర్స్‌ ఏర్పాటుచేశారు. గతంతో పోలిస్తే విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది. గతేడాది 54వేల 78మంది స్టూడెంట్స్‌ పరీక్షలకు హాజరుకాగా..ఈ ఏడాది 55వేల 800మంది విద్యార్థులు ఎగ్జామ్స్‌ రాస్తున్నారు.